News June 28, 2024

అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

image

AP: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో భేటీ అయ్యారు. వివిధ శాఖల్లో నిధుల వినియోగం, చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై ఆరా తీశారు. వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News September 20, 2024

బాంబే హైకోర్టులో కేంద్రానికి చుక్కెదురు.. ఐటీ రూల్స్ సవరణలు కొట్టివేత

image

IT రూల్స్‌కి కేంద్రం చేసిన స‌వ‌ర‌ణ‌ల‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి వ‌చ్చే న‌కిలీ, త‌ప్పుడు వార్త‌ల‌కు అడ్డుక‌ట్ట‌వేయ‌డానికి ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకొనేలా కేంద్రం IT చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేసింది. అయితే ఇది ఆర్టిక‌ల్ 14 (స‌మాన‌త్వం), 19(స్వేచ్ఛ‌) హ‌క్కుల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని జస్టిస్ అతుల్ చందూర్కర్ బెంచ్ అభిప్రాయ‌ప‌డింది.

News September 20, 2024

వైవీ, ధర్మారెడ్డిపై హిందూ సంఘాల ఫిర్యాదు

image

AP: TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ EO ధర్మారెడ్డిపై గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ‘వైవీ, ధర్మారెడ్డి కలిసి తిరుమల లడ్డూను జంతువుల నూనెతో తయారు చేయించి అపవిత్రం చేశారు. తాము తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ CM జగన్‌కు తెలియకుండా ఇది జరగదు. అందుకే ఆయన కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి.

News September 20, 2024

రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల

image

ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కలవనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వనున్నారు.