News October 6, 2024

బీజేపీకి ఓటు వేయాలని కోరిన డేరా చీఫ్

image

అత్యాచారం కేసులో పెరోల్‌పై విడుద‌లైన డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ హ‌రియాణా ఎన్నిక‌ల్లో బీజేపీకి ఓటు వేయాల్సిందిగా త‌న మ‌ద్ద‌తుదారుల‌ను కోర‌డం వివాదం రేపింది. సిర్సాలోని స‌త్సంగ్‌లో శ‌నివారం జ‌రిగిన స‌మావేశంలో బ‌హిరంగంగా కాకుండా స‌మూహంలో క‌లిసిపోయిన‌ త‌న అనుయాయుల ద్వారా బీజేపీకి ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల్ని కోరారు. ప్ర‌తిఒక్క‌రూ ఐదుగురిని పోలింగ్ బూత్‌కు త‌ర‌లించాల‌ని కూడా కోరిన‌ట్టు తెలిసింది.

Similar News

News March 23, 2026

ఖాళీ స్టేడియాల్లో PSL

image

పాక్ సూపర్ లీగ్ పతనం దిశగా సాగుతోంది. మెజార్టీ విదేశీ ఆటగాళ్లు IPL వైపు మొగ్గుచూపుతుండగా, భద్రతా కారణాలతో పలువురు అక్కడికి వెళ్లట్లేదు. ఈ క్రమంలో ఈసారి ప్రేక్షకులు లేకుండా కేవలం 2 వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు PCB ఛైర్మన్ నఖ్వీ వెల్లడించారు. పొదుపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో ఆర్థిక, ఇంధన సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే.

News March 23, 2026

యుద్ధంతో అమెరికాకు ₹7,520 కోట్ల నష్టం

image

పశ్చిమాసియాలోని అమెరికన్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ జరిపిన వైమానిక దాడుల వల్ల USకు ₹7,520 కోట్ల నష్టం వాటిల్లిందని BBC, CSIS నివేదిక వెల్లడించింది. యుద్ధం మొదలైన తొలి 2 వారాల్లోనే ఈ నష్టం జరిగినట్లు అంచనా. జోర్డాన్‌లోని థాడ్ రాడార్ వ్యవస్థ ధ్వంసం అవ్వడం వల్ల సుమారు ₹4,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు US డిఫెన్స్ సిస్టమ్స్‌ను ఛేదించి ఈ విధ్వంసం సృష్టించాయి.

News March 23, 2026

ఖరీఫ్‌కు కష్టమే.. తగ్గిన యూరియా తయారీ!

image

హార్ముజ్ జలసంధి మూతపడటంతో భారత్‌కు రావాల్సిన LNG సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశీయంగా యూరియా ఉత్పత్తి 50% పైగా పడిపోయింది. గ్యాస్ కొరత వల్ల గెయిల్, IOC వంటి సంస్థలు యూరియా ప్లాంట్లకు సప్లై తగ్గించాయి. ఫలితంగా వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన 170-180 లక్షల టన్నుల యూరియా లభ్యతపై ఆందోళన మొదలైంది. ప్రస్తుతం దేశంలో కేవలం 62 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గాయి.