News October 1, 2024
డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్కు 15వ సారి పెరోల్
అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ పెరోల్కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. అక్టోబర్ 5న జరగనున్న హరియాణా ఎన్నికల ముందు ఆయనకు పెరోల్ రావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఈ కేసులో ఆయన గత 9 నెలల్లో మూడుసార్లు, గత నాలుగేళ్లలో 15 సార్లు పెరోల్పై విడుదలవ్వడం గమనార్హం. అతని పెరోల్ రద్దు చేయాలని ఈసీని కాంగ్రెస్ కోరింది.
Similar News
News October 1, 2024
మ్యాచ్లో రోహిత్ ఇచ్చిన సందేశం ఏంటంటే..: KL రాహుల్
బంగ్లాతో రెండో టెస్టులో రెండున్నర రోజుల ఆట వర్షార్పణమైనప్పటికీ టీమ్ ఇండియా అద్భుత ఆటతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడే దీనిక్కారణమని కేఎల్ రాహుల్ తెలిపారు. ‘ఎంత వీలైతే అంత ట్రై చేసి గెలవడానికే చూడాలని 4వ రోజు ఆట మొదలయ్యే సమయానికి రోహిత్ క్లియర్గా చెప్పారు. దీంతో దూకుడుగా ఆడేందుకు ఆటగాళ్లకు స్వేచ్ఛ లభించింది. వికెట్లు పడుతున్నా ఆ దూకుడును కొనసాగించి విజయం సాధించాం’ అని వెల్లడించారు.
News October 1, 2024
రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్
AP: రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పుని ప్రభుత్వం రాయితీపై అందించనుంది. దసరా, దీపావళి పండుగలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనుంది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.150 వరకు ఉండగా రూ.67కి, పంచదార రూ.50 ఉండగా అరకిలో రూ.17కి ఇవ్వనుంది. వీటితో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నల్ని సైతం రేషన్లో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
News October 1, 2024
రజినీ ఆరోగ్యంపై డాక్టర్ల హెల్త్ బులెటిన్
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రెండు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని చెప్పారు. కాగా రజినీ తీవ్రమైన అనారోగ్యంతో నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.