News June 25, 2024
అయోధ్య లీకేజీకి డిజైన్ సమస్యలు కారణం కాదు: నృపేంద్ర మిశ్ర

అయోధ్య రామమందిరం గర్భగుడిలో వాటర్ <<13504392>>లీకేజీ<<>> నిజమేనని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. అయితే దీనికి డిజైన్ సమస్యలు కారణం కాదని వెల్లడించారు. శిఖర నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం మొదటి అంతస్తు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక అన్ని పైపులు మూసివేస్తామన్నారు. డిసెంబర్ నాటికి మొత్తం ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు.
Similar News
News December 21, 2025
పోలీసులే బెట్టింగ్ యాప్లకు బానిసైతే.. ఇక కాపాడేదెవరు?

బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా ఉన్నతాధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, వాడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ కొందరు <<18630060>>పోలీసులే<<>> ఆ యాప్లకు బానిసలుగా మారి, అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళనకరం. సొంతింటినే చక్కదిద్దుకోకపోతే ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకురాగలరు? పోలీసులు ఈ దిశగా ఆలోచన చేయడం అత్యవసరం.
News December 21, 2025
కొత్త ఛార్జీలు ప్రకటించిన రైల్వే

రైలు ఛార్జీలను రైల్వే సవరించింది. 215KM కంటే ఎక్కువ దూర ప్రయాణాలకు ఆర్డినరీ క్లాసులో KMకు ఒక పైసా చొప్పున పెంచింది. మరోవైపు మెయిల్/ఎక్స్ప్రెస్ నాన్-ఏసీ, ఏసీ తరగతులకు KMకు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచింది. ఈ ధరలు ఈనెల 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ మార్పులతో రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపింది. నాన్ AC కోచ్లలో 500 KM జర్నీ చేస్తే ఒక్కో ప్రయాణికుడికి రూ.10 అదనంగా ఖర్చు కానుంది.
News December 21, 2025
ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.


