News June 25, 2024
అయోధ్య లీకేజీకి డిజైన్ సమస్యలు కారణం కాదు: నృపేంద్ర మిశ్ర

అయోధ్య రామమందిరం గర్భగుడిలో వాటర్ <<13504392>>లీకేజీ<<>> నిజమేనని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. అయితే దీనికి డిజైన్ సమస్యలు కారణం కాదని వెల్లడించారు. శిఖర నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం మొదటి అంతస్తు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక అన్ని పైపులు మూసివేస్తామన్నారు. డిసెంబర్ నాటికి మొత్తం ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు.
Similar News
News March 4, 2026
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 19వరకు పంపాలి. పోస్టును బట్టి పీజీ, పీజీ(ఫిజికల్ ఎడ్యుకేషన్) MLSc, PhD, NET/SET/SLET, CA/CS/ICWA, BEd, MEd, మెడికల్ పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://careers.amuonline.ac.in/
News March 4, 2026
నెయ్యి సరఫరాలో చంద్రబాబు స్కామ్లు: జగన్

AP: CM చంద్రబాబు తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని జగన్ Xలో విమర్శించారు. ‘TTD ఛైర్మన్పై ఓ మహిళ ఫిర్యాదు చేస్తే CBN చర్యలు తీసుకోలేదు. అతడినే పదవిలో కొనసాగించి ఆలయ ప్రతిష్ఠను కాలరాశారు. లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరికి మీదికి నెట్టారు. నెయ్యి సరఫరాను ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టి స్కామ్లు చేస్తూ సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు’ అని ఆరోపిస్తూ <
News March 4, 2026
శాసనమండలిలో గందరగోళం

AP: మండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ గందరగోళానికి దారితీసింది. ఛైర్మన్ ఒకే అంశంపై 2 తీర్మానాలను చర్చకు అనుమతించడం సరికాదని మంత్రి నాదెండ్ల అన్నారు. అలా అనుమతిస్తే ప్రభుత్వ స్టేట్మెంట్ను వినాలన్నారు. అందుకు ఛైర్మన్ మోషేను రాజు అనుమతించకపోవడంతో ఇలాంటి చెడు సంప్రదాయాన్ని కొత్తగా తీసుకురావద్దని నాదెండ్ల వ్యాఖ్యానించారు. దీన్ని ఛైర్మన్ ఖండించగా, ప్రభుత్వం ఆయనను అవమానిస్తోందని YCP ఆందోళనకు దిగింది.


