News June 25, 2024
అయోధ్య లీకేజీకి డిజైన్ సమస్యలు కారణం కాదు: నృపేంద్ర మిశ్ర

అయోధ్య రామమందిరం గర్భగుడిలో వాటర్ <<13504392>>లీకేజీ<<>> నిజమేనని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. అయితే దీనికి డిజైన్ సమస్యలు కారణం కాదని వెల్లడించారు. శిఖర నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం మొదటి అంతస్తు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక అన్ని పైపులు మూసివేస్తామన్నారు. డిసెంబర్ నాటికి మొత్తం ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు.
Similar News
News December 14, 2025
సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంక్షేమానికి చట్టం రావాలి: TG హైకోర్టు

సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం చట్టం తేవాలని TG హైకోర్టు అభిప్రాయపడింది. ఉద్యోగుల హక్కులు హరించే అధికారం ఎవరికీ లేదంది. సర్వీస్ అగ్రిమెంట్ను పాటించకుండా రాజీనామా చేస్తున్నందుకు ₹5.9L చెల్లించాలని కంపెనీ డిమాండ్ చేయడంపై ఓ ఉద్యోగి కోర్టుకెక్కారు. విచారణ జరిపిన కోర్టు ఏ ప్రాతిపదికన కంపెనీ పరిహారాన్ని నిర్ణయించిందో తేల్చాలని కార్మికశాఖను, అతని రాజీనామాను ఆమోదించాలని సంస్థను ఆదేశించింది.
News December 14, 2025
భారీ జీతంతో NHAIలో ఉద్యోగాలు..

NHAIలో 84 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBA, B.L.Sc, MA, డిగ్రీ, CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు Dy. mngrకు రూ.56,100-రూ.1,77,500, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ Asst.కు రూ.35,000-రూ.1,12,400, Jr ట్రాన్స్లేటర్కు రూ.35,400-రూ.1,12,400, అకౌంటెంట్కు రూ.29,200-రూ.92,300, స్టెనోగ్రాఫర్కు రూ.25,500-రూ.81,100 చెల్లిస్తారు.వెబ్సైట్: nhai.gov.in
News December 14, 2025
ISIS దాడిలో ముగ్గురు అమెరికన్ల మృతి.. ట్రంప్ వార్నింగ్

సెంట్రల్ సిరియాలో ఐసిస్ చేసిన దాడిలో ముగ్గురు అమెరికన్లు చనిపోయారు. వీరిలో ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు ఉన్నారు. ఈ ఘటనపై US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా, సిరియాపై జరిగిన దాడి అని, బలమైన ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడితో దిగ్భ్రాంతికి గురైనట్లు సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.


