News January 5, 2025

తీవ్ర ఆర్థిక సమస్యలు ఉన్నా రైతుభరోసా పెంచాం: PCC చీఫ్

image

TG: ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసాను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని PCC చీప్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అన్నదాతకు ప్రభుత్వం అండగా నిలబడిందని తెలిపారు. BRS ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని, రూ.7 లక్షల కోట్ల అప్పులతో ఉన్న టైంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రూ.22 వేల కోట్లతో రుణమాఫీ చేశామని, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు.

Similar News

News November 21, 2025

సెయిల్‌లో 124 పోస్టులు.. అప్లై చేశారా?

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.sail.co.in

News November 21, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 11

image

62. డంభం అంటే ఏమిటి? (జ.తన గొప్ప తానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (జ.తన భార్యలో, తన భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (జ.ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (జ.ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (జ.మైత్రి)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 21, 2025

OFFICIAL: రెండో టెస్టుకు కెప్టెన్‌గా పంత్

image

గువాహటి వేదికగా రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. దీంతో జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నట్లు వెల్లడించింది. మెడకు గాయం కారణంగా తొలి టెస్టులోనూ గిల్ బ్యాటింగ్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత గువాహటికి వెళ్లినప్పటికీ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్‌గా లేడని BCCI తెలిపింది. మరిన్ని టెస్టులు, చికిత్స కోసం ముంబై వెళ్తున్నట్లు పేర్కొంది.