News June 20, 2024
ఒడుదొడుకులు ఎదురైనా లాభాలతో ముగిశాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో సెషన్లోనూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 77,478కు చేరింది. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 23,567 వద్ద ముగిసింది. ఓ దశలో నిఫ్టీ గరిష్ఠంగా 23,624కు చేరింది. ప్రైవేట్ బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు నమోదు చేయడంతో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా మార్కెట్లు పుంజుకున్నాయి. త్వరలోనే నిఫ్టీ 23,800 మార్క్ చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News October 8, 2024
GATE-2025 గడువు పొడిగింపు
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్-2025కు దరఖాస్తు గడువు తేదీని అధికారులు మరోసారి పొడిగించారు. గతంలో ప్రకటించినదాని ప్రకారం అక్టోబర్ 3నే గడువు ముగియాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో అక్టోబర్ 11 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. డెడ్లైన్ పొడిగించడం ఇది రెండోసారి. తొలుత సెప్టెంబర్ 26నే గడువు తేదీగా ప్రకటించారు. gate2025.iitr.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
News October 8, 2024
అవినీతి జగన్పై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి: భాను ప్రకాశ్
AP: అవినీతి సొమ్ము ఎలా సంపాదించాలనే విషయంలో జగన్ దేశానికే ఓ రోల్ మోడల్ అని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఆరోపించారు. ‘APని జగన్ నాశనం చేసిన తీరుపై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి. తిరుమలలో కమీషన్లు తీసుకున్న ఘనత గత ప్రభుత్వానిది. TTDకి చెందిన కొన్ని రిజర్వేషన్లలో YV సుబ్బారెడ్డి మార్పులు తెచ్చింది వాస్తవం కాదా? తిరుమలలో ఫొటోషూట్ చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
News October 8, 2024
ఒమర్ అబ్దుల్లానే సీఎం: ఫరూక్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఈనేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ తదుపరి సీఎం అని ప్రకటించారు.