News December 5, 2024
విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ దుమ్మురేపారు. మేఘాలయతో జరిగిన టీ20లో కేవలం 29 బంతుల్లోనే 106* రన్స్ చేశారు. 28 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నారు. శర్మ ఇన్నింగ్సులో 11 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. టీ20ల్లో భారత బ్యాటర్లకు ఇదే జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ. అంతకుముందు గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ ఈ ఏడాది NOVలో 28 బంతుల్లో సెంచరీ చేశారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


