News February 22, 2025

ఈ-శ్రమ్ పోర్టల్‌లో 81 లక్షల మంది వివరాల నమోదు

image

APలో 1.80Cr మంది అసంఘటిత కార్మికులు ఉన్నట్లు కార్మిక శాఖ గుర్తించింది. ఇప్పటి వరకు 81.46L మంది వివరాలను <<8091811>>ఈ-శ్రమ్ పోర్టర్‌లో<<>> నమోదు చేసినట్లు తెలిపింది. వీరిలో 56% మహిళలు, 44% పురుషులు ఉన్నారంది. 18-50ఏళ్ల వ్యక్తులు ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే PM జీవన్ జ్యోతి కింద రూ.2లక్షల బీమా అందుతుంది. 18-70 ఏళ్లవారు రూ.20 చెల్లిస్తే PM సురక్ష బీమా యోజన కింద పలు ప్రయోజనాలు లభిస్తాయి.

Similar News

News December 9, 2025

శోకం నుంచి శక్తిగా.. సోనియా ప్రస్థానం!

image

నేడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు. భర్త రాజీవ్ గాంధీ మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి పురుషుల ఆధిపత్యం ఉన్న రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పార్టీని అకుంఠిత దీక్షతో మళ్లీ అధికారంలోకి తెచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసి సుదీర్ఘకాలం దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2009లో ఇదే రోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఆమె రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించారు.

News December 9, 2025

మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే!

image

అందంగా కనిపించాలని అమ్మాయిలు ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. ఇలా కాకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే సహజంగానే మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. హెల్తీ ఫుడ్, తగినంత నిద్ర, మంచినీళ్లు తాగడం, సంతోషంగా ఉండటం వల్ల సహజంగా అందం పెరుగుతుందంటున్నారు. దీంతో పాటు బేసిక్ స్కిన్ కేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడాలని చెబుతున్నారు.

News December 9, 2025

ఫ్రాడ్ కాల్స్‌ వేధిస్తున్నాయా?

image

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్‌, మెసేజ్‌లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<>https://sancharsaathi.gov.in/sfc/<<>>)లో అనుమానాస్పద కాల్స్‌ను సులభంగా కంప్లైంట్‌ చేయవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్ నంబర్, కాల్ వచ్చిన డేట్, టైమ్ వంటి వివరాలు సమర్పించాలి. ఇది టెలికం మోసాల నియంత్రణలో అధికారులకు కీలకంగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వలన ఇతరులను కూడా రక్షించవచ్చు.