News March 17, 2024
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు.. కొత్త డేటా

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను EC తాజాగా మరోసారి వెల్లడించింది. ఏయే పార్టీకి ఎన్ని కోట్ల విలువైన బాండ్లు వచ్చాయో వివరించింది. BJP-రూ.6,986cr, టీఎంసీ-రూ.1,397cr, కాంగ్రెస్-రూ.1,344cr, బీఆర్ఎస్-రూ.1,322cr, బీజేడీ-రూ.944.5cr, డీఎంకే-రూ.656.5cr, వైసీసీ-రూ.442.8cr, టీడీపీకి రూ.181.35 కోట్ల మొత్తంలో బాండ్ల ద్వారా సమకూరిందని పేర్కొంది. 2019-20లో బీజేపీ అత్యధికంగా రూ.2,555 కోట్ల విలువైన బాండ్లను పొందింది.
Similar News
News August 13, 2025
NEET (UG) కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో MBBS సీట్ల భర్తీకి చేపట్టిన NEET (UG) కౌన్సెలింగ్ ఫస్ట్ రౌండ్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 14 నుంచి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సూచించింది. అలాట్మెంట్ లెటర్ను MCC వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. సీట్ అలాట్మెంట్ లిస్ట్ కోసం ఇక్కడ <
News August 13, 2025
‘కూలీ’ సినిమాను ఎంజాయ్ చేశా: ఉదయనిధి

రేపు విడుదల కానున్న రజినీకాంత్ ‘కూలీ’ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రివ్యూ ఇచ్చారు. ‘ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజినీకాంత్కు అభినందనలు. ఈ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్లో ప్రతి సన్నివేశం ఎంజాయ్ చేశా. ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది’ అని చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
News August 13, 2025
విజయవాడలో 39 పునరావాస కేంద్రాల ఏర్పాటు

AP: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయవాడలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కృష్ణానది, బుడమేరు వాగు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని ప్రజలకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.