News March 17, 2024

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు.. కొత్త డేటా

image

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను EC తాజాగా మరోసారి వెల్లడించింది. ఏయే పార్టీకి ఎన్ని కోట్ల విలువైన బాండ్లు వచ్చాయో వివరించింది. BJP-రూ.6,986cr, టీఎంసీ-రూ.1,397cr, కాంగ్రెస్-రూ.1,344cr, బీఆర్ఎస్-రూ.1,322cr, బీజేడీ-రూ.944.5cr, డీఎంకే-రూ.656.5cr, వైసీసీ-రూ.442.8cr, టీడీపీకి రూ.181.35 కోట్ల మొత్తంలో బాండ్ల ద్వారా సమకూరిందని పేర్కొంది. 2019-20లో బీజేపీ అత్యధికంగా రూ.2,555 కోట్ల విలువైన బాండ్లను పొందింది.

Similar News

News January 25, 2026

పద్మ అవార్డుల ప్రకటన

image

వివిధ రంగాల్లో సేవలందించిన 45 మంది వ్యక్తులకు కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డి(పాడి, పశుసంవర్ధక విభాగం), డాక్టర్ కుమారస్వామి తంగరాజ్‌(జన్యు సంబంధ పరిశోధనలు), తమిళనాడుకు చెందిన నటేశన్ తదితరులు ఉన్నారు.

News January 25, 2026

అగ్నిప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

image

TG: నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో <<18951833>>మృతుల<<>> కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ హరిచందనకు ఆదేశాలు జారీ చేశారు. షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అగ్నిమాపక నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News January 25, 2026

హృతిక్ రోషన్‌కు ఏమైంది?

image

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నిన్న చేతి కర్రల సాయంతో నడుస్తూ కనిపించడం ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్లాక్ హుడీ, క్యాప్ ధరించిన ఆయన.. నడవడానికి ఇబ్బంది పడుతూ కనిపించారు. ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు.