News May 23, 2024
ప్రజ్వల్ రేవణ్ణకు దేవెగౌడ హెచ్చరిక

మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల రేవణ్ణ వెంటనే భారత్ రావాలని మాజీ ప్రధాని, తాత దేవెగౌడ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు Xలో ప్రకటన విడుదల చేశారు. పోలీసుల విచారణకు ప్రజ్వల్ సహకరించాలని కోరారు. ఈ కేసు విచారణలో తాను జోక్యం చేసుకోవడం లేదని దేవెగౌడ పేర్కొన్నారు. 60 ఏళ్లుగా ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవాలు బయటకు రావాల్సి ఉందన్నారు.
Similar News
News February 2, 2026
కంది మొక్కలను వరి పొలం గట్లపై పెంచితే ఏమిటి లాభం?

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.
News February 2, 2026
హైదరాబాద్లోని IIMRలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News February 2, 2026
పిండి దీపం ఎలా తయారుచేయాలి?

పావుశేరు బియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టి, నీరు వడగట్టి నీడన ఆరబెట్టాలి. అనంతరం ఆ బియ్యాన్ని మెత్తని పిండిలా మిల్లులో పట్టించాలి. ఈ పిండిలో తగినంత బెల్లం తురుము, ఆవు నెయ్యి కలిపి ముద్దలా చేయాలి. ఈ ప్రక్రియ అంతా శుచిగా చేయాలి. ఆ ముద్దను ప్రమిద ఆకారంలో మలచి, మధ్యలో దీపం వెలిగించడానికి వీలుగా గుంటలా చేసి సిద్ధం చేయాలి. కుదిరితే ఆ దీపంపై గోవింద నామాలు దిద్దడం మరింత శ్రేయస్కరం.


