News December 14, 2024
అమరావతిలో మరో రూ.20వేల కోట్లతో అభివృద్ధి: నారాయణ

AP: అమరావతిలో మరో ₹20వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం అయ్యే E11, E13, E14 రోడ్లను మంత్రి పరిశీలించారు. అమరావతిలో ఇప్పటికే ₹21వేల కోట్ల పనులకు అనుమతి ఇచ్చామని, సోమవారం జరిగే CRDA అథారిటీ సమావేశంలో రూ.20వేల కోట్ల పనులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
Similar News
News November 27, 2025
పాలమూరు: మాజీ సర్పంచ్ హత్య.. చేసింది వీళ్లే.!

కేటీదొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో పోలీసులు పది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8.5 లక్షల నగదు, నాలుగు కార్లు, రెండు బైకులు, ఒక బొలెరో వాహనం, 11 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ధరూర్ మండలం జాంపల్లి వద్ద చిన్న భీమరాయుడును బొలెరో వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే.
News November 27, 2025
పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.
News November 27, 2025
ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <


