News November 27, 2024
సాస్కి నిధులతో గోదావరి, గండికోట అభివృద్ధి: దుర్గేష్

సాస్కి(స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) పథకం ద్వారా APకి కేంద్రం రూ.113.75 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో అఖండ గోదావరి, గండికోట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తొలి విడత నిధుల్లో 75% వినియోగించాక కేంద్రం తదుపరి విడత నిధులు విడుదల చేస్తుందన్నారు. కేంద్రం సాయంతో పర్యాటకంలో ఏపీని నం.1గా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.
Similar News
News January 5, 2026
HOT TOPIC: ఆంధ్రకూ పాకిన జలజగడం…

TGలో INC, BRSల వరకే ఉన్న జలజగడం కాస్తా APకీ పాకింది. YCP విమర్శలతో ‘రాయలసీమ లిఫ్ట్’ పై రేవంత్ చేసిన కామెంట్లను AP GOVT ఖండించింది. దానివల్లే తాను TDPని వదిలానని రేవంత్ విమర్శలు చేశారు. దీంతో నదీ జలాలపై రిప్లైకి CBN సిద్ధమవుతున్నారు. అటు ఈ అంశాన్ని రాజకీయాస్త్రంగా మలుచుకొనేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా నదీ జలాలపై వేడెక్కిన రాజకీయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారాయి.
News January 5, 2026
OTTలోకి ‘ధురంధర్’.. ఎప్పుడంటే?

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇండియాలో రూ.800కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తొలి హిందీ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. ఇందులో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసలొచ్చాయి.
News January 5, 2026
మహిళా ఆఫీసర్లకు మంత్రి వేధింపులు: BRS

TG: రాష్ట్ర మంత్రి ఒకరు మహిళా ఆఫీసర్లను వేధిస్తున్నారని BRS ఆరోపించింది. “ఎవరా అమాత్యుడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా అధికారులకు రక్షణ ఎక్కడ? ఒక మంత్రి స్థాయి వ్యక్తి మహిళా అధికారులను వేధింపులకు గురిచేస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇదేనా మీరు గొప్పగా చెప్పుకునే ‘ఇందిరమ్మ రాజ్యం’? వెంటనే సదరు మంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి” అని డిమాండ్ చేస్తూ ఓ <


