News August 6, 2024

ఏపీలో లైట్‌హౌస్‌ల అభివృద్ధి

image

దేశంలోని సమ‌ుద్ర తీర ప్రాంతాల్లో 203 లైట్‌హౌస్‌లు ఉన్న‌ట్టు కేంద్రం తెలిపింది. ఇందులో 10 రాష్ట్రాల్లోని 75 లైట్‌హౌస్‌ల‌ను గుర్తించి వాటిని ప‌ర్యాట‌క ప్ర‌దేశాలుగా అభివృద్ధి చేసిన‌ట్టు వెల్ల‌డించింది. ఏపీలోని రామాయపట్నం, మచిలీపట్నం, అంతర్వేది, శాక్రామెంటో, వాకలపూడి, సంతపల్లి, కళింగపట్నం, బారువ, వాడరేవు, పూడిమడక తీరప్రాంతాల్లో లైట్‌హౌస్‌ల‌ను అభివృద్ధి చేసిన‌ట్టు తెలిపింది.

Similar News

News November 10, 2025

పెరిమెనోపాజ్‌ గురించి తెలుసా?

image

నెలసరి ప్రక్రియలో మార్పులు తలెత్తటం, ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గటం మొదలైనప్పటి నుంచీ నెలసరి నిలిచే ముందు దశ ప్రారంభమవుతుంది. దీన్నే పెరిమెనోపాజ్ అంటారు. అంటే మెనోపాజ్‌కు ముందుదశ. ఇది 40ల చివర్లో మొదలవుతుంది. ఈ సమయంలో నెలసరిలో మార్పులు, వేడిఆవిర్లు వస్తుంటాయి. మహిళలు పెరిమెనోపాజ్‌లో రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకుంటూ ఒత్తిడి లేకుండా ఉండాలి. ఆల్కహాల్, ధూమపానం వంటివి మానేయాలి.

News November 10, 2025

నా భర్త హీరోయిన్స్‌తోనే ఎక్కువ గడుపుతాడు: గోవింద భార్య

image

బాలీవుడ్ నటుడు గోవిందపై ఆయన భార్య సునీత సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తన కంటే హీరోయిన్స్ వద్దే ఎక్కువ సమయం గడుపుతాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరో మహిళతో గోవింద అఫైర్ ప్రచారంపై స్పందిస్తూ ‘నేను ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోలేదు కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేయలేను. కాకపోతే ఆమె మరాఠీ నటి అని విన్నా’ అని అన్నారు. వివాదాలతో విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారాన్ని వీరిద్దరూ గతంలో ఖండించారు.

News November 10, 2025

విశాఖ సదస్సుతో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

image

AP: విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సును విజయవంతం చేద్దామని మంత్రి లోకేశ్ సహచర మంత్రులకు పిలుపునిచ్చారు. ఈ సమ్మిట్‌తో ₹10L కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇచ్చిన హామీ మేరకు 20లక్షల ఉద్యోగాల కల్పన త్వరగా నెరువేరుద్దామని చెప్పారు. ప్రతీ మంత్రి తమ శాఖల పరిధిలోని ఒప్పందాల విషయంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.