News August 6, 2024
ఏపీలో లైట్హౌస్ల అభివృద్ధి

దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లో 203 లైట్హౌస్లు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. ఇందులో 10 రాష్ట్రాల్లోని 75 లైట్హౌస్లను గుర్తించి వాటిని పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. ఏపీలోని రామాయపట్నం, మచిలీపట్నం, అంతర్వేది, శాక్రామెంటో, వాకలపూడి, సంతపల్లి, కళింగపట్నం, బారువ, వాడరేవు, పూడిమడక తీరప్రాంతాల్లో లైట్హౌస్లను అభివృద్ధి చేసినట్టు తెలిపింది.
Similar News
News December 20, 2025
దేవుడిని కోర్కెలు కోరుతున్నారా?

దేవుడు సర్వవ్యాపి. సర్వజ్ఞుడు. ఆయన మన ప్రార్థన కంటే దాని వెనకున్న ఉద్దేశాన్ని గమనిస్తాడు. మనమేం కోరకున్నామన్న దానికంటే రోజూ ఏ పనులు చేస్తున్నాం అన్నదే చూస్తాడు. సామాన్యుడి ప్రతి కర్మలను చూస్తూ మనలోని మంచి చెడులను ఎప్పుడూ లెక్కిస్తూ ఉంటాడు. అందుకే ఆయనకు కోర్కెలు కోరకుండా, నిష్కల్మషమైన మనసుతో సత్కర్మలు చేయాలి. మన కర్మలు బాగున్నప్పుడు, భగవంతుడు మనకు అవసరమైన ఫలితాన్ని సరైన సమయంలో తప్పక ప్రసాదిస్తాడు.
News December 20, 2025
22నే పంచాయతీ పాలకవర్గాల తొలి భేటీ

TG: పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల తొలి సమావేశం 22వ తేదీన నిర్వహించనున్నారు. ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ముందుగా పంచాయతీ కార్యాలయాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం పాలకవర్గాలు సమావేశమై చర్చిస్తాయి. కాగా 18 జిల్లాల్లో 90 పంచాయతీల్లో నిలిచిపోయిన ఉప సర్పంచ్ ఎన్నికను ఈసీ ఆదేశాలతో అధికారులు ఈరోజు నిర్వహిస్తున్నారు.
News December 20, 2025
గుడ్లు తింటే క్యాన్సర్ రాదు: FSSAI

గుడ్లను తింటే క్యాన్సర్ వస్తుందని <<18572969>>జరుగుతున్న<<>> ప్రచారాన్ని FSSAI ఖండించింది. కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తిలో ప్రమాదకర నైట్రోఫ్యూరాన్లు, యాంటీబయాటిక్లపై నిషేధం కొనసాగుతోందని తెలిపింది. ‘గరిష్ఠంగా KGకి 1.0 మైక్రోగ్రామ్ నైట్రోఫ్యూరాన్లు ఉండొచ్చు. వీటివల్ల ప్రమాదం లేదు. ఫుడ్ సేఫ్టీ వయలేషన్గా పరిగణించలేం. నైట్రోఫ్యూరాన్లకు క్యాన్సర్కు సంబంధం లేదు. మన దేశంలో గుడ్లు సురక్షితం’ అని స్పష్టం చేసింది.


