News August 6, 2024

ఏపీలో లైట్‌హౌస్‌ల అభివృద్ధి

image

దేశంలోని సమ‌ుద్ర తీర ప్రాంతాల్లో 203 లైట్‌హౌస్‌లు ఉన్న‌ట్టు కేంద్రం తెలిపింది. ఇందులో 10 రాష్ట్రాల్లోని 75 లైట్‌హౌస్‌ల‌ను గుర్తించి వాటిని ప‌ర్యాట‌క ప్ర‌దేశాలుగా అభివృద్ధి చేసిన‌ట్టు వెల్ల‌డించింది. ఏపీలోని రామాయపట్నం, మచిలీపట్నం, అంతర్వేది, శాక్రామెంటో, వాకలపూడి, సంతపల్లి, కళింగపట్నం, బారువ, వాడరేవు, పూడిమడక తీరప్రాంతాల్లో లైట్‌హౌస్‌ల‌ను అభివృద్ధి చేసిన‌ట్టు తెలిపింది.

Similar News

News December 16, 2025

ధనుర్మాసంలో శుభ కార్యాలు ఎందుకు చేయరు?

image

‘ధనుర్మాసంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. అందుకే వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయకూడదు’ అని పండితులు చెబుతున్నారు. జ్యోతిష నిపుణుల కథనం ప్రకారం.. ధనుర్మాసంలో సూర్యుడి రథాన్ని లాగే గుర్రాలు అలసి, విశ్రాంతి తీసుకుంటాయి. వాటి స్థానంలో గాడిదలు రథాన్ని లాగుతాయి. దీంతో సూర్యుని ప్రయాణం ఈ నెల రోజులు మందకొడిగా సాగుతుంది. అందుకే శుభకార్యాలకు ఈ సమయం మంచిది కాదని భావిస్తారు.

News December 16, 2025

నేడు విజయవాడలో జగన్ పర్యటన

image

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ విజయవాడ‌ జోజినగర్‌ ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శిస్తారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. 12PMకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా జోజినగర్‌ వెళ్లి బాధితులతో మాట్లాడనున్నట్లు చెప్పింది. వారంతా ఇప్పటికే జగన్‌ను కలిసి తమ ఇళ్లను ప్రభుత్వం ఎలా కూల్చివేసిందో వివరించారంది. ఈ క్రమంలో ఆయన నేరుగా ఘటనా స్థలికి వెళ్లి బాధితులను కలవనున్నారని పేర్కొంది.

News December 16, 2025

మంగళవారం ఈ పనులు చేయకూడదట..

image

హనుమంతుడికి ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘ఈ రోజు కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కటింగ్, షేవింగ్, గోర్లు కత్తిరించడం వంటివి చేయరాదు. చేస్తే ఆయుష్షు తగ్గుతుంది. అలాగే, అంగారక ప్రభావం వల్ల కొత్త బట్టలు కొనడం, ధరించడం, కొత్త బూట్లు వేసుకోవడం మంచిది కాదు. మసాజ్ చేయించుకోవడం కూడా ఆరోగ్య సమస్యలకు, ఇంట్లో తగాదాలకు దారితీయవచ్చు’ అంటున్నారు.