News August 6, 2024

ఏపీలో లైట్‌హౌస్‌ల అభివృద్ధి

image

దేశంలోని సమ‌ుద్ర తీర ప్రాంతాల్లో 203 లైట్‌హౌస్‌లు ఉన్న‌ట్టు కేంద్రం తెలిపింది. ఇందులో 10 రాష్ట్రాల్లోని 75 లైట్‌హౌస్‌ల‌ను గుర్తించి వాటిని ప‌ర్యాట‌క ప్ర‌దేశాలుగా అభివృద్ధి చేసిన‌ట్టు వెల్ల‌డించింది. ఏపీలోని రామాయపట్నం, మచిలీపట్నం, అంతర్వేది, శాక్రామెంటో, వాకలపూడి, సంతపల్లి, కళింగపట్నం, బారువ, వాడరేవు, పూడిమడక తీరప్రాంతాల్లో లైట్‌హౌస్‌ల‌ను అభివృద్ధి చేసిన‌ట్టు తెలిపింది.

Similar News

News December 14, 2025

జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్

image

AP: రాష్ట్రంలో పుస్తక సంబరాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే జనవరి 2 నుంచి 11 రోజులపాటు విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 36వ బుక్ ఫెస్టివల్ జరగనుంది. రోజూ 6PMకు సందర్శన మొదలవుతుంది. లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. డైలీ సాహిత్య సదస్సులు, పుస్తకావిష్కరణలు ఉంటాయి. కార్యక్రమ ప్రారంభానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. తాజాగా పుస్తక ప్రదర్శన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

News December 14, 2025

ఆదివారం ఏం కొనాలి? ఏం కొనకూడదు?

image

ఆదివారం ఇంటి నిర్మాణ వస్తువులు, గార్డెనింగ్ సామాగ్రి, ఇనుము, ఫర్నిచర్, హార్డ్‌వేర్, వాహన వస్తువులను కొనుగోలు చేయకూడదని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆర్థిక నష్టానికి, పేదరికానికి దారితీస్తుందని చెబుతున్నారు. అయితే కంటికి సంబంధించిన వస్తువులు, గోధుమలు, రాగి, ఎరుపు రంగు వస్తువులు కొనడం మాత్రం శుభప్రదమని అంటున్నారు. ఇది ఆర్థిక ఎదుగుదలకు, సూర్యుడి అనుగ్రహానికి దోహదపడుతుందని వివరిస్తున్నారు.

News December 14, 2025

మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మిస్తాం: వివేక్

image

TG: రాబోయే మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మిస్తామని మంత్రి వివేక్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. వికారాబాద్‌లోని నస్కల్‌లో ATC శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. యువతకు సరైన ఉద్యోగాలు రావాలంటే స్కిల్ తప్పనిసరని చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టకపోగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. త్వరలోనే తమ ప్రభుత్వం మరో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తుందని పేర్కొన్నారు.