News February 11, 2025
తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో నిన్నటితో పోల్చితే భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. ఇవాళ టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం(నిన్న 15గంటలు) పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,169 మంది దర్శించుకోగా, వారిలో 24,559 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Similar News
News January 17, 2026
మహిళలు నేడు ‘సావిత్రి గౌరీ వ్రతం’ ఆచరిస్తే..?

ముక్కనుమ సందర్భంగా నూతన వధువులు నేడు ‘సావిత్రి గౌరీ వ్రతం’ ఆచరిస్తే దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ‘ఈ వ్రతం చేసిన వివాహితలకు సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది. పెళ్లికాని అమ్మాయిలు ఈ పూజలో పాల్గొంటే సద్గుణాల భర్త లభిస్తాడు. ఈ వ్రతం కుటుంబంలో సుఖశాంతులను, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది’ అని చెబుతున్నారు. ఈ వ్రతం ఎలా, ఎప్పుడు చేయాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News January 17, 2026
పిల్లల్లో RSV ఇన్ఫెక్షన్

రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని ‘బ్రాంకియోలైటిస్’ అంటారు. ఇది ఏడాదిలోపు పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. 3,4 రోజుల తర్వాత దీని లక్షణాల తీవ్రత పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరంతో ఖంగు ఖంగుమని ఏకధాటిగా దగ్గుతుంటారు. కొంతమంది పిల్లల్లో ఆయాసం వస్తుంది. ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. విపరీతమైన ఆయాసం ఉన్నా, ఫీడింగ్ సరిగా లేకపోయినా పిల్లల్ని హాస్పిటల్లో ఉంచే వైద్యం చేయాలి.
News January 17, 2026
RSV ఇన్ఫెక్షన్ను ఎలా నివారించాలంటే?

వర్షాకాలం, చలికాలంలో ఇన్ఫెక్షన్లు ప్రబలినప్పుడు గుంపులోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. బిడ్డను తీసుకొని ఫంక్షన్లకు వెళ్లడం సరికాదు. దగ్గు, జలుబు ఉన్నవాళ్లకు తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉండాలి. సరైన ఇమ్యూనిటీ లేని పిల్లలకు ఆర్ఎస్వీ ఇమ్యూనోగ్లోబ్యులిన్ వ్యాక్సిన్ ఇస్తారు. పిల్లల్లో లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్కు తీసుకెళ్లాలి. పిల్లలకు పోషకాహారం ఎక్కువగా ఇవ్వాలి.


