News April 9, 2024
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

AP: ఉగాది పండగ వేళ శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తున్నారు. పండగ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ భక్తులు భారీగా వచ్చారు.
Similar News
News February 4, 2026
‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

AP: ‘మనమిత్ర’ పేరుతో ప్రభుత్వం తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్కు ఆదరణ పెరుగుతోంది. 50 లక్షల మంది దీని ద్వారా సేవలందుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 900 సేవలందిస్తుండగా త్వరలోనే 1000కి పెంచనున్నారు. పాస్ పుస్తకాలు, ఆలయ సేవలు, బస్ టికెట్ల బుకింగ్, పన్నులు, బిల్లుల చెల్లింపులను ఈ యాప్తో చేసేయొచ్చు. 9552300009 నంబర్తోని ఈ యాప్ ప్రతి ఇంటి చిరునామాగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.
News February 4, 2026
చెత్త ఏరుకునే వారిలో SCలే అధికం: కేంద్రం

సామాజికంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులపై కేంద్రం చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో 1.52 లక్షల మంది చెత్త ఏరుకునేవారు ఉన్నారని, వీరిలో దాదాపు 84.5% మంది SC, ST, OBC సామాజిక వర్గాలకు చెందినవారేనని తేలింది. వీరిలో SCలు 60.3%, OBCలు 13.7%, OCలు 10.7%, STలు 10.5% ఉన్నారు. వీరందరికీ సంక్షేమ పథకాలు, బీమా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను సేకరించింది.
News February 4, 2026
కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినా అది రాజవదు: KTR

TG: మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ <<19051424>>వాడిన<<>> భాషను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. హార్వర్డ్లో ఎన్ని కోర్సులు చేసినా రేవంత్ తన భాషను మార్చుకోలేదని, సంస్కారం నేర్చుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన KCR వంటి నాయకుడిపై విషం చిమ్మడం రేవంత్ అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. కనకపు సింహాసనంపై కూర్చున్నంత మాత్రాన కుక్క రాజవదంటూ మండిపడ్డారు.


