News March 18, 2024
ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు

ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వేలాది మంది తరలిరాగా సోమవారం కూడా భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి సుందరంగా అలంకరించారు. సహస్రనామార్చన కుంకుమార్చన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. పలువురు బోనాలు, ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కిక్కిరిసిపోయారు.
Similar News
News April 18, 2026
ద్విచక్ర వాహనాలు ఢీ.. పదో తరగతి విద్యార్థి మృతి

టేక్మాల్ (M) ఎల్లంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సండ్రు సదానందం (16) మృతి చెందగా, శెట్టి గోపాల్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ వేర్వేరు బైక్లపై వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే సదానందం ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడు ఇటీవలనే SSC పరీక్షలు రాశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 18, 2026
మెదక్ జిల్లాలో కాకతీయ శిల్పం గుర్తింపు

చిన్నశంకరంపేట మండలం మండలంలోని గవ్వలపల్లి శివాలయం వద్ద కాకతీయ శైలికి చెందిన తాంత్రిక భైరవ శిల్పాన్ని చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. చతుర్భుజాలతో, మెడలో సర్పహారం, డమరుకం ధరించి త్రిభంగిమలో ఉన్న ఈ శిల్పం అరుదైనదని ఆయన తెలిపారు. మన పూర్వీకులు అందించిన ఇలాంటి పురాతన విగ్రహాలను, చారిత్రక సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
News April 18, 2026
మెదక్ జిల్లాలో కాకతీయ శిల్పం గుర్తింపు

చిన్నశంకరంపేట మండలం మండలంలోని గవ్వలపల్లి శివాలయం వద్ద కాకతీయ శైలికి చెందిన తాంత్రిక భైరవ శిల్పాన్ని చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. చతుర్భుజాలతో, మెడలో సర్పహారం, డమరుకం ధరించి త్రిభంగిమలో ఉన్న ఈ శిల్పం అరుదైనదని ఆయన తెలిపారు. మన పూర్వీకులు అందించిన ఇలాంటి పురాతన విగ్రహాలను, చారిత్రక సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.


