News February 11, 2025
కుంభామేళాకు పోటెత్తనున్న భక్తులు.. అధికారుల కీలక నిర్ణయం

ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తం నో వెహికల్ జోన్గా మారుస్తామని తెలిపారు. కాగా కుంభమేళాలో రోజూ దాదాపు 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు అధికారుల అంచనా.
Similar News
News February 5, 2026
42 ఏళ్ల పాటు నిరీక్షణ.. 100 ఏళ్ల వృద్ధుడికి దక్కిన న్యాయం

42 ఏళ్ల క్రితం అరెస్ట్ అయిన ఓ వృద్ధుడికి (100 Yrs) ఎట్టకేలకు న్యాయం దక్కింది. 1982లో జరిగిన ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ధనీరామ్ను అలహాబాద్ HC నిర్దోషిగా ప్రకటించింది. ఆయన చేసిన అప్పీల్ 4 దశాబ్దాల పాటు పెండింగ్లోనే ఉండిపోయింది. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం, విచారణలో లోపాలతో పాటు వయసుని పరిగణనలోకి తీసుకుంది. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థలో జాప్యంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
News February 5, 2026
నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – వాటిని గుర్తించే విధానం

భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లు.. విత్తన కుళ్లు, మొలక మాడు, నారు కుళ్లు, వేరు కుళ్లు, మొదలు కుళ్లు, కాండం కుళ్లు, తల కుళ్లు. పంటలో ఈ తెగుళ్లను ముందే గుర్తించేందుకు పొలంలో వేర్వేరు ప్రదేశాల్లో మొక్కలను ఎన్నుకొని, పీకి మెల్లగా మట్టిని తొలగించి శుభ్రం చేయాలి. అప్పుడు వేరు, భూమిలో ఉండే కాండం భాగాల్లో ఏదైనా రంగు మార్పు కనిపిస్తుందేమో చూడాలి. ఏదైనా మార్పు కనిపిస్తే అది వ్యాధి తొలి లక్షణంగా గుర్తించాలి.
News February 5, 2026
అర్ధరాత్రి నుంచి OTTలో ‘రాజాసాబ్’

ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. అటు శివకార్తికేయన్, శ్రీలీల తదితరులు నటించిన ‘పరాశక్తి’ మూవీ ఈ నెల 7న జీ5లో విడుదల కానుంది.


