News November 9, 2024

పవన్‌తో డీజీపీ తిరుమలరావు భేటీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, అరెస్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 21, 2026

అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే నష్టం: రేవంత్

image

TG: భిన్నాభిప్రాయలు చెప్పేవారు ఉంటారని, అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే నష్టమని CM రేవంత్ తెలిపారు. ‘అందరం కలిసి పని చేస్తేనే అనుకున్నది సాధిస్తాం. గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే పార్టీ కాంగ్రెస్. డిజిటల్ మెంబర్‌షిప్‌పై దృష్టిపెట్టాలి. DCCలుగా పని చేసినవారికే MLA టికెట్లు ఇచ్చాం’ అని అనంతగిరి సభలో అన్నారు. <<19135982>>రాజగోపాల్ రెడ్డి <<>>వ్యాఖ్యల నేపథ్యంలోనే CM పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

News February 21, 2026

YSR వారసత్వాన్ని జగన్ దిగజారుస్తున్నారు: యూత్ కాంగ్రెస్

image

ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ తీరు దేశాన్ని కించపరిచేలా ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాజకీయాల కంటే దేశ ప్రతిష్ఠ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దీనిపై యూత్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. YSR వారసత్వాన్ని జగన్ దిగజారుస్తున్నారని, CID/ED కేసుల భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి ఆశయాలను వదిలేశారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

News February 21, 2026

AUSWపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

image

అడిలైడ్ వేదికగా జరిగిన <<19201544>>మూడో టీ20లో<<>> ఆస్ట్రేలియా మహిళల జట్టుపై 17 రన్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై భారత్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. ఈ మ్యాచ్‌లో 177 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆసీస్‌ను 159/9 స్కోరుకే పరిమితం చేసింది. ఆష్లీ గార్డనర్ 57, లిచ్‌ఫీల్డ్ 26 మినహా అందరూ విఫలమయ్యారు. శ్రీచరణి, శ్రేయాంక చెరో 3, అరుంధతి 2, రేణుక ఒక వికెట్ తీశారు.