News December 8, 2024
కమిటీ నివేదిక ఆధారంగా ధరణి ప్రక్షాళన: మంత్రి పొంగులేటి

TG: రైతులకు మేలు జరిగే సూచనలు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ధరణి ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. 2024 ఆర్వోఆర్ కొత్త చట్టాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని చెప్పారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్యులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News October 17, 2025
తిరుమల: శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం!

AP: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల వరకు సమయం పడుతోంది. అటు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 30 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న స్వామిని 61,521 మంది దర్శించుకోగా.. 25,101 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.66కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
News October 17, 2025
ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్.. భారీ వర్షాలు

AP: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-55KM వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
News October 17, 2025
జనగణన.. వచ్చేనెల ఇళ్ల లెక్కింపు

దేశంలో జనగణన కసరత్తు మొదలైంది. NOV 10-30 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఏరియాల్లో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ చేపట్టనున్నారు. 2027లో జనగణన తొలిదశ జరగనుంది. దేశాభివృద్ధి, ప్రజల పరిస్థితులు తెలుసుకునేందుకు దీన్ని నిర్వహిస్తారు. ఈ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు రూపొందిస్తారు. దేశంలో 1872 నుంచి జనగణన చేస్తుండగా చివరిసారి 2011లో జరిగింది.