News July 19, 2024
MotoGP ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్గా ధవన్

ప్రతిష్ఠాత్మక MotoGP ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ శిఖర్ ధవన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని గ్లోబల్ బైక్ రేసింగ్ బాడీ ప్రకటించింది. ఈ రేస్ వచ్చే ఏడాది మార్చిలో బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC)లో జరగనుంది. స్వస్థలం ఢిల్లీ వీధుల్లో తనకిష్టమైన బైక్ను నడిపే ఛాన్స్ దొరికినందుకు ధవన్ హర్షం వ్యక్తం చేశారు. కొత్త ప్రేక్షకులకు MotoGPని పరిచయం చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


