News July 19, 2024

MotoGP ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధవన్

image

ప్రతిష్ఠాత్మక MotoGP ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెటర్ శిఖర్ ధవన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని గ్లోబల్ బైక్ రేసింగ్ బాడీ ప్రకటించింది. ఈ రేస్ వచ్చే ఏడాది మార్చిలో బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC)లో జరగనుంది. స్వస్థలం ఢిల్లీ వీధుల్లో తనకిష్టమైన బైక్‌ను నడిపే ఛాన్స్ దొరికినందుకు ధవన్ హర్షం వ్యక్తం చేశారు. కొత్త ప్రేక్షకులకు MotoGPని పరిచయం చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు.

Similar News

News November 23, 2025

ఏపీ టెట్.. కొన్ని గంటలే గడువు

image

AP TET దరఖాస్తులకు కొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. ఇవాళ 11.59PMలోపు అప్లై చేసుకోవాలి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే దాదాపు 2L మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 3న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. DEC 10 నుంచి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. JAN 19న ఫలితాలు వెల్లడిస్తారు.
వెబ్‌సైట్: https://cse.ap.gov.in/

News November 23, 2025

వేగంగా కోలుకుంటున్న శ్రేయస్

image

ఆసీస్‌తో ODI సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై PBKS కో ఓనర్ ప్రీతిజింటా అప్డేట్ ఇచ్చారు. ఆ జట్టు ప్లేయర్ శశాంక్ సింగ్ బర్త్‌డే పార్టీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. శ్రేయస్ అద్భుతంగా రికవరీ అవుతూ బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా SAతో ODI సిరీస్‌కు అతను ఇప్పటికే దూరమయ్యారు. జనవరిలో NZతో జరిగే వన్డేలకు అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

News November 23, 2025

సీట్స్ ఫుల్.. టికెట్స్ నిల్! తప్పదు చిల్లు..!!

image

AP: సంక్రాంతికి ఊరికి వెళ్దాం అనుకున్న వారికి ఈసారీ అధిక చెల్లింపు చిల్లు తప్పదేమో. పెద్ద పండుగకు ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలకు వెళ్లే రైళ్లు, విమానాల్లో టికెట్స్ బుక్ అయ్యాయి. రెండు నెలల ముందే సీట్స్ నిండి వెయిటింగ్ లిస్ట్ వందల్లో కన్పిస్తోంది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ బుకింగ్స్ రేట్స్ ఇప్పట్నుంచే పెంచేస్తున్నాయి. ఇంకేముంది.. ఎప్పట్లాగే ఈసారీ ప్రైవేటును ఆశ్రయించి ఛార్జీ వేటుకు గురవక తప్పదు.