News March 31, 2025
ధోనీ మ్యాచ్ విన్నర్ కాదు.. ఈ గణాంకాలే నిదర్శనం: విశ్లేషకులు

క్రికెట్లో ధోనీ బెస్ట్ ఫినిషర్. అతను చివరి వరకు క్రీజులో ఉంటే గెలుపు ఖాయమనే మాటలకు ఇక కాలం చెల్లినట్లే. అతని IPL గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2023 నుంచి ఇప్పటి వరకు ఛేజింగ్ చేస్తూ జట్టు గెలిచిన సందర్భాల్లో అతను 3 మ్యాచ్లలో 3 రన్స్(9 బాల్స్) మాత్రమే చేశారు. ఓడిన గేమ్స్లో 6 Innsలలో 166 రన్స్(84 బంతులు) చేశారు. దీన్నిబట్టి టీమ్ విజయాల్లో ధోనీ పాత్ర ఏమీ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీరేమంటారు?
Similar News
News April 2, 2025
ఆరెంజ్ అలర్ట్.. ఇవాళ, రేపు వడగళ్ల వర్షం

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని IMD వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు, రేపు ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.
News April 2, 2025
SBI అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా?

నిన్న ఎస్బీఐ సేవల్లో <<15956785>>అంతరాయంతో<<>> కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉ.8.15 నుంచే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యూపీఐ సేవల్లో సమస్యలు ఎదురయ్యాయి. తమ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అయ్యాయని, ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అయ్యాయని కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంకా డబ్బులు క్రెడిట్ కాలేదని, వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై SBI ఇంకా స్పందించలేదు. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా?
News April 2, 2025
శ్రేయస్ అయ్యర్ సరికొత్త ఘనత

ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరో ఘనత సాధించారు. టోర్నీలో అత్యధిక విన్ పర్సంటేజీ సాధించిన మూడో కెప్టెన్గా అయ్యర్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 72 మ్యాచులకు సారథ్యం వహించి 55.55% విజయాలు సాధించారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (55.06%) రికార్డును ఆయన అధిగమించారు. ఈ జాబితాలో ధోనీ (58.84%) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత సచిన్ (58.82%) కొనసాగుతున్నారు.