News April 15, 2025

ధోనీ మరో రికార్డ్.. POTM అవార్డ్ నూర్‌కు ఇవ్వాల్సిందన్న మహీ

image

LSGతో మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 26 రన్స్ చేసిన ధోనీని POTM అవార్డ్ వరించింది. దీంతో IPL చరిత్రలో ఈ అవార్డ్ అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయర్‌(43yrs 281d)గా ఆయన నిలిచారు. గతంలో ఈ రికార్డ్ లెగ్ బ్రేక్ బౌలర్ ప్రవీణ్ తాంబే(43yrs 60d) పేరిట ఉండేది. మరోవైపు, ధోనీ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవార్డ్ ఎందుకు ఇచ్చారు? నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశారు’ అని అన్నారు. అతను 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చారు.

Similar News

News April 16, 2025

రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేశారా?

image

AP: బియ్యం పంపిణీ ఆగిపోవద్దంటే లబ్ధిదారులు రేషన్ కార్డు e-KYCని ఈనెలాఖరులోగా పూర్తి చేయాలి. e-KYC స్టేటస్ కోసం epds1.ap.gov.in <>సైట్‌కు<<>> వెళ్లాలి. డాష్‌‌బోర్డుపై క్లిక్ చేసి, epds అప్లికేషన్ సర్చ్ లేదా రైస్ కార్డ్ సర్చ్‌లో కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. కార్డులోని పేర్ల ఎదురుగా సక్సెస్ లేదా S అని ఉంటే KYC పూర్తయినట్లు. ఒకవేళ లేకపోతే డీలర్/MDU వాహనం వద్ద ఈపోస్ యంత్రంలో వేలిముద్ర వేసి KYC పూర్తి చేయాలి.

News April 16, 2025

అమరావతిపై అపోహలు సృష్టించొద్దు: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతిపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. భూములిచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని హామీ ఇచ్చారు. ‘ఇప్పటికే అమరావతిలో పనులు పూర్తయ్యాయి. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే పరిశ్రమలు వచ్చి భూముల ధరలు పెరుగుతాయి. అందుకే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని CM భావించారు’ అని ఆయన పేర్కొన్నారు.

News April 16, 2025

సీఎంను కలిసిన 16వ ఆర్థిక సంఘం బృందం

image

AP: పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు వంటి అంశాలపై సీఎం ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వారికి వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రత్యేక సాయంపై చర్చించారు. 16వ ఆర్థిక సంఘం బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.

error: Content is protected !!