News September 18, 2024

వచ్చే ఏడాదిలోనూ ధోనీ IPL ఆడాలి: రైనా

image

భారత మాజీ కెప్టెన్ ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లోనూ ఆడాలని సురేశ్ రైనా అన్నారు. దేశమంతా మహీ ఆటను చూడాలనుకుంటోందని చెప్పారు. గత సీజన్‌లో ఆయన మెరుగైన ప్రదర్శన చేశారని చెప్పారు. ప్రతి ప్లేయర్, కోచ్‌లు మిస్టర్ కూల్ ఆటను మరికొంత కాలం చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు రైనా తెలిపారు.

Similar News

News October 27, 2025

తుఫాను తీరాన్ని తాకడం అంటే ఏంటి?

image

తుఫాను ఏర్పడినప్పుడు సముద్రంలోని సుడిగుండాల మధ్యలో ఉండే భాగాన్ని తుఫాను కన్ను (సైక్లోన్ ఐ) అంటారు. ఇది 50-60 కి.మీ పరిధిలో విస్తరించి ఖాళీగా ఉంటుంది. సైక్లోన్ ఐ తీరాన్ని (భూమిని) తాకితే <<18121128>>తుఫాను తీరాన్ని తాకిందని<<>> అర్థం. అది తీరాన్ని దాటే సమయంలో మేఘాలు చెల్లాచెదురై భారీ వర్షాలు కురుస్తాయి. వరదలు ముంచెత్తుతాయి. భీకర గాలులకు చెట్లు కూలిపోతాయి. సముద్రపు అలలు భూమిపైకి దూసుకొస్తాయి.

News October 27, 2025

తుఫాన్.. ఈ జిల్లాల్లో సెలవులు పొడిగింపు

image

AP: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరులో అధికారులు రేపు కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడలో ఈ నెల 31 వరకు సెలవులు కొనసాగనున్నాయి. విశాఖ, కడప, ఏలూరు, ఉమ్మడి గోదావరిలో రేపు, కోనసీమ, కృష్ణా, NTR, గుంటూరు, అనకాపల్లి, విజయనగరం, మన్యం, అనకాపల్లి, బాపట్ల, అల్లూరిలో ఎల్లుండి వరకు హాలిడేస్ ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురంలో ఎలాంటి సెలవులు ఇవ్వలేదు.

News October 27, 2025

‘మనీవ్యూ’కు సైబర్ షాక్.. 3 గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టారు

image

రుణాలిచ్చే మనీవ్యూ యాప్‌కు సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. యాప్ సిస్టమ్‌లోకి చొరబడి 3గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టారు. 653 ఫేక్ అకౌంట్లకు డబ్బును బదిలీ చేసుకున్నారు. దుబాయ్, చైనా, హాంగ్‌కాంగ్, ఫిలిప్పీన్స్‌ నుంచి అంతర్జాతీయ ముఠా ఈ దాడి చేసిందని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. దుబాయ్‌లోని భారత సంతతి వ్యక్తి సూత్రధారి అని చెప్పింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, ₹10 కోట్లు ఫ్రీజ్ చేశారు.