News October 21, 2024
CSKతోనే ధోనీ.. ఆ జట్టు సీఈవో ఏమన్నారంటే?
ఐపీఎల్లో CSK తరఫున ఎంఎస్ ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ కూల్ జట్టుకు ఆడాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే దీనిపై ధోనీ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఈ నెల 31లోపు నిర్ణయాన్ని వెల్లడిస్తానని MS చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా CSKలో తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News October 21, 2024
ఆస్ట్రేలియాతో సిరీస్కు సిద్ధం: షమీ
గాయం కారణంగా ఏడాదిగా క్రికెట్కు దూరంగా ఉంటున్న పేసర్ షమీ తాను పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు సిద్ధంగా ఉన్నట్లు సెలెక్టర్లకు సిగ్నల్ ఇచ్చారు. ‘నేను హాఫ్ రన్తో బౌలింగ్ ప్రారంభించా. 100 శాతం నొప్పి లేకుండా ఉన్నా. ఆస్ట్రేలియాతో మ్యాచ్లకు ఎలాంటి అస్త్రాలు కావాలనే దానిపై వర్క్ చేస్తున్నా. అంతకు ముందు రంజీట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడాలనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
News October 21, 2024
కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలు వెల్లడించాలి: కడియం
TG: గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. దోపిడీని ప్రశ్నించినందుకే తనను పక్కనపెట్టారని అన్నారు. ‘2014లో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఎన్ని? కేసీఆర్ నీతిమంతులైతే తమ ఆస్తుల వివరాల్ని వెల్లడించాలి’ అని ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదని, ఆ పార్టీల నేతలు అధికారం కోసం పోటీ పడుతున్నారని అన్నారు.
News October 21, 2024
‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ న్యూ లుక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ ‘రాజా సాబ్’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. కాగా ఎల్లుండి టైటిల్ ట్రాక్ విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త లుక్లో ప్రభాస్ అదిరిపోయారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ కానుంది.