News October 27, 2024
సీఎస్కేలో ధోనీకి సరైన వారసుడు పంతే: సైమన్

చెన్నై సూపర్ కింగ్స్లో ధోనీకి సరైన వారసుడు రిషభ్ పంతేనని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డారు. ‘పంత్ గనుక ఢిల్లీని వదిలేసి వేలంలోకి వస్తే అతడిని దక్కించుకునేందుకు చెన్నై ఎంతవరకైనా వెళ్తుంది. ధోనీ తర్వాత సరైన ప్రత్యామ్నాయం అతడే. మరి రిషభ్ను ఢిల్లీ వదులుకుంటుందా లేదా అన్నది చూడాలి’ అని పేర్కొన్నారు. తాను వేలంలోకి వస్తే ఎంత ధర వస్తుందంటూ పంత్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News September 16, 2025
సూర్యను నీరజ్ చోప్రా ఫాలో అవుతారా?

ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా పాక్ కెప్టెన్కు భారత కెప్టెన్ సూర్య షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. ఇప్పుడు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అందరి దృష్టి పడింది. రేపు, ఎల్లుండి టోక్యోలో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ ఛాంపియన్, పాక్ ప్లేయర్ అర్షద్ నదీమ్ను నీరజ్ ఎదుర్కోనున్నారు. మరి షేక్ హ్యాండ్ విషయంలో SKYని భారత త్రోయర్ ఫాలో అవుతారా అనే చర్చ మొదలైంది.
News September 16, 2025
కోహ్లీ బయోపిక్ డైరెక్ట్ చేయను: అనురాగ్ కశ్యప్

కోహ్లీ అంటే అభిమానం ఉన్నా ఆయన బయోపిక్కు తాను దర్శకత్వం వహించనని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నారు. కోహ్లీ అంటే అందరికీ ఇష్టమని, ఆయనొక అద్భుతమని కొనియాడారు. ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్ట్నే ఎంచుకుంటానని తెలిపారు. సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపిస్తానని పేర్కొన్నారు. కాగా అనురాగ్ తెరకెక్కించిన ‘నిషాంచి’ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది.
News September 16, 2025
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మన దేశంపై ట్రంప్ 50శాతం టారిఫ్లు విధించిన తర్వాత తొలిసారి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య ఐదు విడతల్లో సమావేశాలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ ఇప్పటికే భారత్కు వచ్చిన విషయం తెలిసిందే.