News November 27, 2024
డయాఫ్రం వాల్ ప్లాట్ఫాం పనులు ప్రారంభం

AP: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ ప్లాట్ఫాం పనులు నిన్న ప్రారంభం అయ్యాయి. వచ్చే జనవరిలో డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా దీన్ని నిర్మిస్తున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు మధ్య పాత డయాఫ్రం వాల్కు సమీపంలో దీన్ని కడుతున్నారు. డయాఫ్రం వాల్ వెడల్పు 1.5 మీటర్లు ఉంటుంది. దీన్ని ప్లాస్టిక్ కాంక్రీట్తో నిర్మించనున్నారు.
Similar News
News November 22, 2025
రీసర్వే.. అభ్యంతరాల పరిష్కారానికి రెండేళ్ల గడువు: RRR

AP: భూముల రీసర్వేపై రైతుల అభ్యంతరాల పరిష్కారానికి MRO స్థాయిలో ప్రస్తుతం ఏడాది గడువు ఉంది. దీన్ని రెండేళ్లకు పెంచేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని Dy.స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. 16వేల గ్రామాలకుగాను ఇప్పటికి 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యిందన్నారు. 7 లక్షల అభ్యంతరాలురాగా 2 లక్షల అభ్యంతరాలు పరిష్కారమయ్యాయని చెప్పారు. రీసర్వేను 2027 DECలోగా పారదర్శకంగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
News November 22, 2025
BOIలో 115 SO పోస్టులు

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. వెబ్సైట్: https://bankofindia.bank.in/
News November 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 74

ఈరోజు ప్రశ్న: వేంకటేశ్వరస్వామి ద్వార పలుకులు అయిన జయవిజయులు తర్వాతి మూడు జన్మలలో అసురులుగా ఎందుకు జన్మించారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>


