News March 27, 2025
ఈ ఏడాది చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి: సీఎం

AP: గత ప్రభుత్వం రాజకీయ కక్షతో పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘గత ప్రభుత్వం కాఫర్ డ్యాంలను సకాలంలో నిర్మించకపోవడంతో రూ.440 కోట్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దీంతో మళ్లీ కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి వచ్చింది. దాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తాం. 2026 ఫిబ్రవరి నాటికి ECRF గ్యాప్-1, 2027 జూన్ నాటికి ECRF గ్యాప్-2 పూర్తి చేస్తాం’ అని మీడియాతో చెప్పారు.
Similar News
News October 22, 2025
భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!

వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే. ఇటీవల చైనా ఎరువుల ఎగుమతులు నిలిపివేయడంతో రబీ సీజన్లోనూ ఇబ్బందులు తప్పేలా లేవు. యూరియా, డీఏపీ తదితర ఎరువులను దాదాపు 95% ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. చైనా ఆంక్షలతో ధరలు 10-15% మేర పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి 5-6 నెలలు కొనసాగొచ్చని తెలుస్తోంది. దీంతో రైతులపై అదనపు భారం పడనుంది.
News October 22, 2025
TTD: 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు

AP: తిరుమల శ్రీవారి ట్రస్టులకు గత 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.338.8 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.252.83 కోట్లు, ఎస్వీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.97.97 కోట్లు, ప్రాణదానం ట్రస్టుకు రూ.66.53 కోట్లు, గోసంరక్షణకు రూ.56.77 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.33.47 కోట్లను దాతలు అందించారు. ఆన్లైన్లో రూ.579.38 కోట్లు, ఆఫ్లైన్లో రూ.339.2 కోట్లు వచ్చాయి.
News October 22, 2025
పేల సమస్యకు ఈ డివైజ్తో చెక్

వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది మహిళలకు పేల సమస్య ఉంటుంది. వాటిని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి పరిష్కారంగా వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ హెడ్ లైస్ కోంబ్. చూడటానికి ట్రిమ్మర్లా కనిపించే ఈ డివైజ్ పేలతో పాటు, వాటి గుడ్లనూ ఫిల్టర్లోకి లాగేస్తుంది. తర్వాత డివైజ్ను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆన్లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి.


