News October 20, 2024
గుర్లలో డయేరియా తగ్గుముఖం పట్టింది: మంత్రి కొండపల్లి
AP: భూగర్భ జలాల కలుషితం వల్లే విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం వ్యాప్తి చెందిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం గుర్లలో అతిసారం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. 41 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. క్లోరినేషన్ పనులు చేపట్టామని, ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం తాగునీటి వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు.
Similar News
News October 20, 2024
నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు
TG: రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా BRS ఆందోళనలు చేపట్టనుంది. మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు బంధును ఎత్తివేసే కుట్రలో భాగంగానే రైతు భరోసా పేరుతో క్యాబినెట్ సబ్ కమిటీ, కొత్త గైడ్లైన్స్ అంటూ డ్రామా చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్కు రైతుల ఉసురు తగులుతుందని దుయ్యబట్టారు.
News October 20, 2024
పుష్పశ్రీవాణి ఎస్టీనే అని తేల్చిన హైకోర్టు
AP: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ST కులానికి చెందిన వారేనని హైకోర్టు తీర్పునిచ్చినట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. DLSC కమిటీ రిపోర్ట్, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో 6ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషనర్ వద్ద ఆధారాలు లేవంటూ కేసు కొట్టివేసింది. కాగా ఆమె ST కాదంటూ ఇద్దరు వ్యక్తులు 2019లో పిటిషన్ వేశారు. ఓ వర్గం కావాలనే తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి అన్నారు.
News October 20, 2024
సర్ఫరాజ్పై అనిల్ కుంబ్లే ప్రశంసలు
న్యూజిలాండ్తో తొలి టెస్టులో 150 పరుగులతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్పై మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. కివీస్ స్పిన్నర్లపై సర్ఫరాజ్ ఆధిపత్యం చెలాయించారని, పేస్ బౌలింగ్లోనూ నిలకడగా ఆడారని కొనియాడారు. బౌలర్లపై ఎలా ప్రెజర్ తీసుకురావాలో అతనికి బాగా తెలుసన్నారు. అతను ఎక్కువగా క్రీజులో నుంచి కదలకుండా గేమ్ ప్లాన్ అమలు చేస్తారని అన్నారు. కాగా రెండో ఇన్నింగ్సులో భారత్ 462 రన్స్ చేసింది.