News May 24, 2024

హార్దిక్ పాండ్య, నటాషా విడిపోయారా?

image

క్రికెటర్ హార్దిక్ – నటాషా దంపతులు విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఇన్‌స్టా ప్రొఫైల్ నేమ్ నుంచి హార్దిక్ పేరు తొలగించడం ఈ రూమర్లకు బలం చేకూరుస్తోంది. అంతేకాక ఇటీవల ఇద్దరూ సింగిల్‌గా ఉన్న ఫొటోలే తమ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో పోస్ట్ చేసిన కపుల్ ఫొటోలు మాత్రం నటాషా తొలగించలేదు. కానీ డివోర్స్ రూమర్లపై ఇరువురూ స్పందించలేదు. 2020 మేలో వీరి వివాహం జరుగగా ఆ ఏడాది జూలైలో అగస్త్య పుట్టాడు.

Similar News

News November 25, 2025

UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

image

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<>UIDAI<<>>) 8 టెక్నికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. షార్ట్ లిస్ట్, స్క్రీన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://uidai.gov.in/

News November 25, 2025

ఆకుకూరల సాగు- అనువైన నేలలు, వాతావరణం

image

తక్కువ సమయంలో రైతు చేతికొచ్చి, నిరంతరం ఆదాయం అందించే పంటల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను మురుగు నీరు ఇంకిపోయే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.5గా ఉండాలి. వానాకాలం, వేసవి కాలం, 16 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సమయం ఆకుకూరల పంటలు పెరగడానికి అత్యంత అనుకూలం. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తోటకూరను సాగు చేయడం కష్టం.

News November 25, 2025

మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు: సజ్జల

image

AP: వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ‘కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పుడు ఇవే కంపెనీలు, ఇప్పుడూ ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి.. నెయ్యి కల్తీకి ఎక్కడ అవకాశం ఉంది’ అని ప్రెస్ మీట్‌లో ప్రశ్నించారు.