News August 12, 2025

రష్యా చమురు కొనబోమని భారత్ చెప్పిందా!

image

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు నిలిపేస్తే పరిస్థితేంటని అంతటా చర్చిస్తున్నారు. అయితే భారత వైఖరేంటో పట్టించుకోవడమే లేదు. జియో పాలిటిక్స్, స్వప్రయోజనాలు, తక్కువ ధరను బట్టి నచ్చిన మార్కెట్లో కొంటామందే తప్ప రష్యా నుంచి ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదు. పైగా అక్కడి నుంచి కొనొద్దని రిఫైనరీలకు ఆదేశాలూ ఇవ్వలేదు. కొన్నాళ్ల కిందట రష్యా వద్ద ధరెక్కువని ఇరాక్, సౌదీ నుంచి దిగుమతులు పెంచుకోవడమే ఇందుకు ఉదాహరణ.

Similar News

News August 12, 2025

హైదరాబాద్ మెట్రోకు నిరాశ

image

హైదరాబాద్ మెట్రోకు కేంద్ర క్యాబినెట్ మరోసారి మొండిచేయి చూపింది. ఇవాళ్టి సమావేశంలో బెంగళూరు, థాణె, పుణే, ఢిల్లీ, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు రూ.1.09 లక్షల కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు అనుమతించింది. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-3పై ప్రకటనేమీ లేకపోవడంతో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. HYD రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగిందని, మెట్రో నిర్మాణానికి అనుమతివ్వాలని కోరుతున్నారు.

News August 12, 2025

ChatGPT సలహా ప్రాణం మీదకొచ్చింది!

image

డైట్ ప్లాన్ కోసం ChatGPTని వాడిన 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు. టేబుల్ సాల్ట్‌కు బదులు సోడియం బ్రోమైడ్ తీసుకోవాలని సూచించడంతో అతను 3 నెలలుగా దీనిని వాడుతున్నాడు. ఇది విషంగా మారడంతో అతను మతిస్థిమితం కోల్పోయాడని, తీవ్రదాహం, పట్టుకోల్పోవడం వంటి సమస్యలు ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత అతను కోలుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

News August 12, 2025

మోదీ జీ.. ట్రాఫిక్ నుంచి కాపాడాలంటూ చిన్నారి లేఖ

image

బెంగళూరులోని ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాసిందో ఐదేళ్ల చిన్నారి. ‘నరేంద్ర మోదీ జీ. ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మేము పాఠశాలలకు, ఆఫీసులకు లేటుగా వెళ్తున్నాం. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ప్లీజ్ హెల్ప్ చేయండి’ అని లేఖలో రాసింది. ఈ ఫొటోను ఆ చిన్నారి తండ్రి ట్విటర్‌లో షేర్ చేయగా వైరలవుతోంది. ఇక్కడ పీక్ టైమ్‌లో KM ప్రయాణించేందుకు గంట పడుతుందని చెబుతుంటారు.