News October 24, 2024

పవర్‌లో ఉన్నప్పుడు జగన్ పరామర్శలకు వెళ్లారా?: ఆలపాటి

image

AP: నేరపూరిత ఆలోచనలతో జగన్ ఐదేళ్లు పరిపాలన సాగించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర్రప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ పరామర్శలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. ‘వైసీపీ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు జగన్ మాట్లాడలేదు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై నోరు మెదపలేదు. ఇప్పుడు పరామర్శలు చేస్తూ రాజకీయంగా మాపై బురద చల్లుతున్నారు’ అని దుయ్యబట్టారు.

Similar News

News December 12, 2025

3 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

image

PM మోదీ ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 బిన్ ఆల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు PM ముందుగా ఆ దేశానికి వెళ్తారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ భేటీ కీలకం కానుంది. అక్కడి నుంచి ఇథియోపియా వెళ్తారు. ఆ దేశానికి ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశంలో చర్చల అనంతరం ఒమన్ చేరుకొని తిరుగు పయనమవుతారు.

News December 12, 2025

4 కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన: CM రేవంత్

image

TG: ఫుట్‌బాల్ తనకు ఇష్టమైన ఆట అని CM రేవంత్ తెలిపారు. ‘టీం స్పిరిట్‌ను ప్రదర్శించాల్సిన క్రీడ ఇది. TG టీంకు లీడర్‌గా 4కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన. సంగారెడ్డి(D) సదాశివపేట్ కంకోల్‌లోని వోక్సెన్ వర్సిటీ సందర్శన వేళ విద్యార్థులతో కాసేపు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశా’ అని ట్వీట్ చేసి ఫొటోలను షేర్ చేశారు. రేపు ఉప్పల్‌లో మెస్సీ టీంతో రేవంత్ జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.

News December 12, 2025

PHOTO VIRAL: వరల్డ్ కప్ హీరోస్

image

టీమ్‌ఇండియా-సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌లో జరిగిన ఓ సీన్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ముల్లాన్‌పూర్ మైదానంలో తన పేరుతో స్టాండ్ ఓపెనింగ్‌ ఉండటంతో యువరాజ్ సింగ్ మ్యాచుకు వచ్చారు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లను కలిసి మాట్లాడారు. తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తోనూ కాసేపు సరదాగా గడిపారు. ‘2007, 2011 వరల్డ్ కప్ హీరోస్ ఇన్ వన్ ఫ్రేమ్’ అంటూ వీళ్లిద్దరి ఫొటోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.