News October 24, 2024

పవర్‌లో ఉన్నప్పుడు జగన్ పరామర్శలకు వెళ్లారా?: ఆలపాటి

image

AP: నేరపూరిత ఆలోచనలతో జగన్ ఐదేళ్లు పరిపాలన సాగించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర్రప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ పరామర్శలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. ‘వైసీపీ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు జగన్ మాట్లాడలేదు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై నోరు మెదపలేదు. ఇప్పుడు పరామర్శలు చేస్తూ రాజకీయంగా మాపై బురద చల్లుతున్నారు’ అని దుయ్యబట్టారు.

Similar News

News December 11, 2025

థాయ్‌లాండ్‌లో పట్టుబడిన లూథ్రా బ్రదర్స్‌

image

గోవా నైట్‌క్లబ్ <<18509860>>ప్రమాదం<<>>లో కీలక నిందితులు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డారు. డిసెంబర్‌ 7న రాత్రి క్లబ్‌లో మంటలు చెలరేగి 25 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వీరిద్దరూ పరారయ్యారు. నిబంధనల ఉల్లంఘనే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. త్వరలో లూథ్రా బ్రదర్స్‌నూ భారత్‌కు తీసుకురానున్నారు.

News December 11, 2025

సోనియాగాంధీతో CM రేవంత్ భేటీ

image

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించిన తీరును ఆమెకు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల వారి నుంచి సదస్సుకు వచ్చిన స్పందన, పెట్టుబడుల గురించి వివరించారు. ₹5.75 లక్షల కోట్ల ఇన్వెస్టుమెంట్లకు జరిగిన ఒప్పందాలను చెప్పారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించారు.

News December 11, 2025

పార్లమెంటులో అమరావతి బిల్లు ప్రవేశపెడతాం: పెమ్మసాని

image

AP: అమరావతిని శాశ్వత రాజధాని చేసేలా పార్లమెంటులో ప్రస్తుత, లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. ‘రాజధానిగా 2014 నుంచా? లేక ఇప్పటి నుంచి గుర్తించాలా? అనే సాంకేతిక కారణంతో బిల్లు ఆలస్యమైంది. CBN మానిటర్ చేస్తున్నారు. అనేక సంస్థలు ఇప్పటికే కొలువుదీరుతున్నాయి. BILLపై విషం కక్కుతున్న జగన్‌ను రాజకీయ సమాధి చేయాలి. AP భవిష్యత్‌ను నాశనం చేశారు’ అని దుయ్యబట్టారు.