News October 24, 2024
పవర్లో ఉన్నప్పుడు జగన్ పరామర్శలకు వెళ్లారా?: ఆలపాటి

AP: నేరపూరిత ఆలోచనలతో జగన్ ఐదేళ్లు పరిపాలన సాగించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర్రప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ పరామర్శలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. ‘వైసీపీ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు జగన్ మాట్లాడలేదు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై నోరు మెదపలేదు. ఇప్పుడు పరామర్శలు చేస్తూ రాజకీయంగా మాపై బురద చల్లుతున్నారు’ అని దుయ్యబట్టారు.
Similar News
News January 7, 2026
BREAKING: ప్రభాస్, చిరంజీవి సినిమాల నిర్మాతలకు ఊరట

రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్లో ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పుష్ప-2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ-2 చిత్రాలకే పరిమితం చేసింది.
News January 7, 2026
BJP-INC: సిద్ధాంతాలు గాలికి.. కార్యకర్తలే మారాలి

రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు కాదు అధికారమే లక్ష్యమని అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక నిరూపించింది. రాజకీయాల్లో ఉప్పూనిప్పుగా భ్రమ కల్పించే BJP-INC అక్కడ <<18786772>>కలిసిపోవడం<<>> ఆ పార్టీల నైతికతను ప్రశ్నిస్తోంది. అసెంబ్లీలు, పార్లమెంటులో ప్రజాప్రయోజన అంశాలపై చర్చకు ఏకతాటిపైకి రాని పార్టీలు అధికారం కోసం చేతులు కలపడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటివి చూసైనా కార్యకర్తలు మారాల్సిన అవసరం ఉంది. ఏమంటారు?
News January 7, 2026
భార్య నన్ను కొడుతోంది: నటుడు ధనుష్

భార్య ఆశ్రిత తనను కొడుతోందని కన్నడ నటుడు ధనుష్ రాజ్ గిరినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసి, బాత్రూమ్లో గాజు పగలగొట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్టు కంప్లైంట్లో పేర్కొన్నారు. కట్నం కోసం వేధించారని, ఫిజికల్గా దాడి చేశారని సౌత్ డివిజన్ మహిళా పోలీస్ స్టేషన్లో ధనుష్ భార్య ఆశ్రిత కూడా ఫిర్యాదు చేశారు. తనకు అబద్ధం చెప్పి వేరే మహిళతో విదేశాలకు వెళ్లాడని ఆరోపించారు.


