News October 24, 2024
పవర్లో ఉన్నప్పుడు జగన్ పరామర్శలకు వెళ్లారా?: ఆలపాటి

AP: నేరపూరిత ఆలోచనలతో జగన్ ఐదేళ్లు పరిపాలన సాగించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర్రప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ పరామర్శలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. ‘వైసీపీ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు జగన్ మాట్లాడలేదు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై నోరు మెదపలేదు. ఇప్పుడు పరామర్శలు చేస్తూ రాజకీయంగా మాపై బురద చల్లుతున్నారు’ అని దుయ్యబట్టారు.
Similar News
News December 23, 2025
విద్యుత్ ఛార్జీలు తగ్గించండి… ఇరిగేషన్ శాఖ లేఖ

TG: ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సరఫరా అయ్యే విద్యుత్పై అదనపు ఛార్జీలను తగ్గించాలని ఇరిగేషన్ శాఖ విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాసింది. నెలకు KVAకు ₹300 చొప్పున వసూలు చేయడాన్ని ఆపాలంది. యూనిట్ విద్యుత్కు వసూలు చేస్తున్న ₹6.30 సుంకాన్నీ తగ్గించాలని పేర్కొంది. ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్లకు సరఫరా అవుతున్న విద్యుత్ లోడ్ 2819.80 MWగా ఉంది. 2026లో ఇది 7348 MWకు చేరుతుందని అంచనా.
News December 23, 2025
ఇదే లాస్ట్ ఛాన్స్: అక్రమ వలసదారులకు US వార్నింగ్

అక్రమ వలసదారులు ఏడాది చివరికి స్వచ్ఛందంగా దేశాన్ని వీడేందుకు రిజిస్టర్ చేసుకుంటే 3వేల డాలర్లు ఇస్తామని ట్రంప్ సర్కారు ప్రకటించింది. స్వదేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ ఫ్రీగా ఇస్తామని చెప్పింది. సెల్ఫ్ డిపోర్టేషన్ ప్రోగ్రామ్లో భాగంగా ఇప్పటివరకు చెల్లించే వెయ్యి డాలర్లను $3వేలకు పెంచింది. దేశాన్ని వీడేందుకు వారికి ఇదే చివరి అవకాశమని, తర్వాత అరెస్టు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News December 23, 2025
TDP-JSP అబద్ధాలు బయట పడ్డాయి: జగన్

AP: వైసీపీ హయాంలో AP బ్రాండ్ దెబ్బతిందంటూ TDP, JSP చెప్పింది అబద్ధమని తేలినట్లు Ex.CM జగన్ పేర్కొన్నారు. ‘AP బ్రాండ్, పెట్టుబడులు దెబ్బతిన్నాయని వారు ఆరోపించారు. కానీ RBI డేటా ప్రకారం 2019-24 మధ్య మాన్యుఫాక్చరింగ్లో సౌత్లో AP ఫస్ట్, దేశవ్యాప్తంగా ఐదోస్థానంలో ఉంది. ఇండస్ట్రీ సెక్టార్లో సౌత్లో ఫస్ట్, దేశంలో 8వ స్థానంలో నిలిచింది. దీనిని బ్రాండ్ దెబ్బతినడం అంటారా?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.


