News October 24, 2024
పవర్లో ఉన్నప్పుడు జగన్ పరామర్శలకు వెళ్లారా?: ఆలపాటి

AP: నేరపూరిత ఆలోచనలతో జగన్ ఐదేళ్లు పరిపాలన సాగించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర్రప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ పరామర్శలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. ‘వైసీపీ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు జగన్ మాట్లాడలేదు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై నోరు మెదపలేదు. ఇప్పుడు పరామర్శలు చేస్తూ రాజకీయంగా మాపై బురద చల్లుతున్నారు’ అని దుయ్యబట్టారు.
Similar News
News December 11, 2025
హోరాహోరీ.. 3 ఓట్లతో విజయం

TG: సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. కొందరు స్వల్ప ఓట్ల తేడాతోనే విజయం సొంతం చేసుకుంటున్నారు. రంగారెడ్డి(D) ఫరూక్నగర్ మండలం శేరిగూడలో కొండం శారద శంకర్గౌడ్ 3 ఓట్లతో గెలుపొందారు. అటు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్లో అన్నాచెల్లెళ్లు బరిలో నిలవగా చెల్లెలు స్రవంతి ఘన విజయం సాధించారు.
News December 11, 2025
కిచెన్ పరికరాలతో సిద్ధంగా ఉండండి: మమత

SIR పేరుతో ఓట్లు తొలగిస్తే కనుక అడ్డుకోవడానికి కిచెన్ పరికరాలతో సిద్ధంగా ఉండాలని WB CM మమత మహిళలకు పిలుపునిచ్చారు. వారితో పాటే పురుషులూ పోరాడాలన్నారు. ‘మీరు దాడి చేస్తే ఎలా అడ్డుకోవాలో తెలుసు. BIHAR చేయలేకపోయింది. మేము చేసి చూపిస్తాం’ అని BJPని హెచ్చరించారు. ఆ పార్టీ IT సెల్ రూపొందించిన జాబితాతో ఎన్నిక జరపాలని చూస్తోందన్నారు. WB నుంచి ప్రజలను వెళ్లగొట్టేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.
News December 11, 2025
6 దేశాల్లో ధురంధర్ బ్యాన్.. ఎందుకంటే?

రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ చిత్రం ఈ వారంలో రూ.200 కోట్ల క్లబ్లో చేరే అవకాశముందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిత్రానికి గల్ఫ్ దేశాల్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాల్లో మూవీ రిలీజ్ కోసం టీమ్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ దేశాల్లో రిలీజ్ చేయలేదు. ‘యాంటీ పాకిస్థాన్ కంటెంట్’ అన్న కారణంతోనే ఆ దేశాలు మూవీని బ్యాన్ చేశాయి.


