News October 24, 2024
పవర్లో ఉన్నప్పుడు జగన్ పరామర్శలకు వెళ్లారా?: ఆలపాటి

AP: నేరపూరిత ఆలోచనలతో జగన్ ఐదేళ్లు పరిపాలన సాగించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర్రప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ పరామర్శలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. ‘వైసీపీ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు జగన్ మాట్లాడలేదు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై నోరు మెదపలేదు. ఇప్పుడు పరామర్శలు చేస్తూ రాజకీయంగా మాపై బురద చల్లుతున్నారు’ అని దుయ్యబట్టారు.
Similar News
News December 16, 2025
అవెంజర్స్, సూపర్ మ్యాన్ కల్పితాలు.. మనవి సత్యాలు: బోయపాటి

అఖండకు అవెంజర్స్లా స్కోప్ ఉందని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. ‘నిజానికి అవెంజర్స్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అన్నీ కల్పితాలు. కానీ మనకున్న పాత్రలన్నీ సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలు వాడినట్లు రేడియేషన్ కనిపిస్తుంటుంది’ అని మీడియా సమావేశంలో అన్నారు. పూర్తి లాజిక్తోనే మూవీని తీశామని, అష్టసిద్ధి సాధన చేసిన తర్వాత పాత్రకు అసాధారణ శక్తులు రావడం సహజమని చెప్పారు.
News December 16, 2025
IPL-2026 మినీ వేలం అప్డేట్స్

*బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్
*రూ.7 కోట్లకు వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ను దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
*రాహుల్ త్రిపాఠిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్
*నిస్సాంక- రూ.4 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
*మాథ్యూ షార్ట్- రూ.1.50 కోట్లు (చెన్నై)
News December 16, 2025
లిక్కర్ అమ్మకాలకు డిసెంబర్ కిక్కు

TG: మద్యం అమ్మకాల ఆదాయం ఈ నెలలో భారీగా పెరగనుంది. స్థానిక ఎన్నికలతో తొలి 2 వారాల్లోనే ₹2వేల కోట్లు వచ్చాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల లిక్కర్కు డిమాండ్ పెరిగింది. అటు క్రిస్మస్ ఫెస్టివల్, నూతన సంవత్సర వేడుకలూ ఉండడంతో అమ్మకాలు పెరగనున్నాయి. నెలాఖరుకల్లా మరో ₹2వేల కోట్లు సమకూరి మొత్తం ఆదాయం ₹4వేల కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది DECలో ₹3,700 కోట్లు వచ్చాయి.


