News October 24, 2024
పవర్లో ఉన్నప్పుడు జగన్ పరామర్శలకు వెళ్లారా?: ఆలపాటి

AP: నేరపూరిత ఆలోచనలతో జగన్ ఐదేళ్లు పరిపాలన సాగించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర్రప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ పరామర్శలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. ‘వైసీపీ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు జగన్ మాట్లాడలేదు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై నోరు మెదపలేదు. ఇప్పుడు పరామర్శలు చేస్తూ రాజకీయంగా మాపై బురద చల్లుతున్నారు’ అని దుయ్యబట్టారు.
Similar News
News December 27, 2025
బంగ్లాదేశ్ కోసం ధర్మయుద్ధం చేశాం: ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్

1971లో బంగ్లాలో పాక్ సైన్యం చేసిన అరాచకాలను చూస్తూ ఉండలేకపోయిన భారత్ ‘ధర్మయుద్ధం’ చేసిందని ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ గుర్తుచేశారు. పాక్ ఎప్పుడూ అధర్మాన్నే నమ్ముకుందని.. మనం మాత్రం శత్రువులకు కూడా గౌరవం ఇచ్చామన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే కచ్చితంగా తగిన సమయంలో అది బుద్ధి చెబుతుందని పరోక్షంగా బంగ్లాను హెచ్చరించారు.
News December 27, 2025
గుడికి వెళ్లొచ్చిన తర్వాత కాళ్లుచేతులు కడగకూడదా?

గుడికి వెళ్లొచ్చిన వెంటనే కాళ్లు, చేతులు కడగకూడదని పండితులు సూచిస్తున్నారు. అలా కడిగితే గుడిలో లభించిన దైవిక శక్తి, పాజిటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయంటున్నారు. ‘ప్రదక్షిణల ద్వారా పాదాలు, పూజ ద్వారా శరీరం గ్రహించిన శక్తిని వెంటనే నీటితో కడిగేయకూడదు. కనీసం 15-20 నిమిషాల వరకు వేచి ఉండటం మంచిది. అయితే ఏదైనా తినే ముందు లేదా అపరిశుభ్రంగా అనిపిస్తే చేతులు కడుక్కోవడంలో తప్పు లేదు.
News December 27, 2025
స్వయంకృషి: మెటల్ ఇన్వెస్ట్మెంట్

సింపుల్గా చెప్పాలంటే బంగారం, వెండి వంటి లోహాలపై పెట్టుబడి. ఇవేకాక కాపర్, అల్యూమినియం, ఐరన్ ఇలా చాలా మెటల్స్ ఉన్నాయి. ఇవి అంతర్జాతీయంగా నిరంతరం వినియోగంలో ఉంటాయి. ధరలు పెరుగుతాయి, లేదా కొంత కరెక్షన్ ఉంటుంది తప్ప పడిపోవు. కొంతకాలం మెటల్ మార్కెట్ను పరిశీలిస్తే మీకు అవగాహన వస్తుంది. నెల క్రితం కేజీ వెండి ఇవాళ్టి కంటే రూ.1లక్ష తక్కువ. నెలలో ఎంత లాభమో చూశారుగా.
రోజూ ఒంటిగంటకి ఓ బిజినెస్ ఐడియా


