News November 10, 2024
పితృస్వామ్యం ఇందిరను PM కాకుండా ఆపిందా?: కేంద్రమంత్రి నిర్మల

మహిళల ఎదుగుదలకు పితృస్వామ్యం అడ్డుకాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులోని CMS బిజినెస్ స్కూల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘పితృస్వామ్య వ్యతిరేకత అనేది వామపక్షాలు తీసుకొచ్చిన కాన్సెప్ట్. దానికి ప్రభావితం కావొద్దు. మీరు మీ కాళ్లమీద నిలబడి, ధైర్యంగా మాట్లాడగలిగితే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇందిరాగాంధీ ప్రధాని కాకుండా పితృస్వామ్యం ఆపిందా?’ అని ప్రశ్నించారు.
Similar News
News February 21, 2026
RITES లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 21, 2026
మామిడి: ఈ దశలో కాయ తొలిచే పురుగు ముప్పు మొదలు

మామిడి కాయలు నిమ్మ సైజు కంటే పెద్దవయ్యే దశ నుంచి కాయ తొలిచే పురుగులు కాయల తొడిమలు, రెండు కాయలు కలసి ఉన్నచోట గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన పురుగులు కాయలను తొలిచి తింటూ అవి పగిలి, రాలి పోవడానికి కారణమవుతాయి. ఈ పురుగులను గుర్తిస్తే లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్(50 ఇ.సి) 1ml మరియు వేప మందు (10,000 ppm) 2ML కలిపి పిచికారీ చేయాలి. పండుఈగ కట్టడికి ఎకరాకు 8-10 మిథైల్ యూజీనాల్ ట్రాప్స్ అమర్చాలి.
News February 21, 2026
తిరుమలలో నిత్యం కల్యాణమే..

తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి అర్చకులు రోజూ అత్యంత వైభవంగా వివాహం జరుపుతారు. భక్తుల దాంపత్య సౌఖ్యం కోసం ఈ సేవ నిర్వహిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరుపుతారు. ఈ కళ్యాణమహోత్సవం చూడడానికి భక్తులకు కన్నుల పండువగా ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు స్వామివారి ఆశీస్సులతో పాటు వస్త్ర బహుమానం, ప్రసాదం లభిస్తాయి.


