News September 6, 2024

వరదల్లో బైక్ మునిగిపోయిందా? ఇలా చేయండి

image

వరదల్లో బైక్ ఇంజిన్ మునిగిపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్ చేయొద్దని టెక్నీషియన్లు సూచిస్తున్నారు. త్రీవీలర్ సాయంతో షోరూమ్ లేదా మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాలని, వెంటనే స్టార్ట్ చేస్తే బైక్ బోర్‌కు వస్తుందని చెబుతున్నారు. బైక్ ఇంజిన్ వరకు మునిగితే ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ మార్చుకుంటే చాలని, పెట్రోల్ ట్యాంక్ కూడా మునిగితే ఎక్కువ ఖర్చు అవుతుందని వివరిస్తున్నారు.
SHARE IT

Similar News

News January 27, 2026

TODAY HEADLINES

image

* దేశవ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
* రేపు బ్యాంకులు బంద్!
* AP: పేదరిక నిర్మూలనే లక్ష్యం: గవర్నర్ నజీర్
* ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలి: CBN
* TDP పతనానికి లోకేశ్ నాంది: అంబటి
* TG: 3 ట్రిలియన్ డాలర్ల ప్రగతే లక్ష్యం: జిష్ణుదేవ్
* పట్టణ పేదలకు 72 గజాల భూమి: పొంగులేటి
* TG బడ్జెట్‌లో నీళ్లు, నిధులు, నియామకాలకు ప్రాధాన్యం
* రేవంత్ మాట్లాడుతుంటే టీవీలు ఆఫ్ చేయండి: KTR

News January 27, 2026

ఇండియా-EU ట్రేడ్ డీల్.. ఆటో స్టాక్స్‌లో ఆందోళన!

image

భారత్-EU మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో మంగళవారం ఆటోమొబైల్ షేర్లపై ఇన్వెస్టర్లు ఫోకస్‌ చేయనున్నారు. యూరోపియన్ కార్లపై దిగుమతి సుంకాలను 110% నుంచి 40%కి తగ్గించే అవకాశముందని సమాచారం. అదే జరిగితే భారత ఆటో మార్కెట్‌లో పోటీ పూర్తిగా మారనుంది. దేశీయ కంపెనీలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లో ఆటో షేర్లు ఒడుదొడుకులకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

News January 27, 2026

18 ఏళ్ల చర్చల తర్వాత ఇండియా-EU ట్రేడ్ డీల్ ఖరారు

image

దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ చారిత్రక ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌’ను మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు భారీగా పెరగనున్నాయి. రాబోయే 6 నెలల్లోపు అధికారిక సంతకాలు పూర్తయ్యి 2027 ప్రారంభం నాటికి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది.