News October 5, 2024
రుణమాఫీ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుందా?: మోదీ

మహారాష్ట్రలో పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ‘రైతులకు రుణమాఫీ చేస్తామనే హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి ఇన్ని రోజులైనా ఎందుకు చేయడం లేదని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర రైతులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మహా వికాస్ అఘాడీ కూటమిని ఓడించాలి’ అని మోదీ పిలుపునిచ్చారు.
Similar News
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.
News September 18, 2025
విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఓపెనర్ ఫ్రైలింక్ విధ్వంసం సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మొత్తం 31 బంతుల్లో 77 రన్స్ చేసి ఔట్ అయ్యారు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఫ్రైలింక్ బాదుడుతో నమీబియా 20 ఓవర్లలో 204/7 రన్స్ చేసింది. ఛేజింగ్లో జింబాబ్వే ఎదురొడ్డుతోంది.