News June 4, 2024

మద్య నిషేధ హామీనే YCP కొంపముంచిందా?

image

AP: మద్య నిషేధ హమీని పక్కనపెట్టి కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడమూ YCP ఓటమికి ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డబ్బు పెట్టినా తాము కోరుకున్న బ్రాండ్‌లు దొరకకపోవడంతో మందుబాబులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినట్లు తెలుస్తోంది. నాణ్యమైన మద్యం ఇవ్వాలని వారు కోరినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. తమ ఓటు బ్యాంకులో అసలు మందుబాబులే లేరని సజ్జల కూడా వాదించారు. దీనినే TDP క్యాష్ చేసుకుంది.

Similar News

News November 28, 2025

MHBD: పాత బిల్లులు రాలే.. పోటీ చేయాలా? వద్దా?

image

గత ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచులకు ప్రభుత్వం మారినా ఇప్పటికీ అభివృద్ధి పనుల బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసొచ్చిన నాయకులు మళ్లీ పోటీ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండిపోయారు. పోటీ చేస్తే ఖర్చుపెట్టినా మళ్లీ గెలుస్తామో? గెలవమో? అని నాయకులు జంకుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 482 పంచాయతీలు ఉన్నాయి.

News November 28, 2025

అమ్మకానికి రెండు IPL జట్లు: హర్ష్ గోయెంకా

image

ఒకటి కాదు రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ‘ఆర్సీబీ మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా అమ్మకానికి వస్తుందని నేను విన్నాను. వీటిని కొనుగోలు చేసేందుకు నలుగురు.. ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, USA ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి’ అని ట్వీట్ చేశారు.

News November 28, 2025

స్మృతితో పెళ్లిపై పలాశ్ తల్లి ఏమన్నారంటే..

image

స్మృతి మంధాన వివాహంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పలాశ్ ముచ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆ రోజు జరిగిన పరిణామాలపై ఇద్దరూ బాధపడుతున్నారు. మ్యారేజ్ అవగానే స్మృతికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేశాం. అనుకోని పరిస్థితులతో వివాహం వాయిదా వేశాం’ అని చెప్పారు. కాగా పెళ్లి సంబంధిత పోస్టులను స్మృతి డిలీట్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.