News May 15, 2024

ఈ ప్రయాణం సాధ్యమవుతుందని అనుకున్నామా: రష్మిక

image

ముంబైలో ఇటీవల ప్రారంభమైన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’పై ప్రయాణించిన నటి రష్మిక తన అనుభవాన్ని పంచుకున్నారు. ముంబై నుంచి నవీ ముంబై వెళ్లేందుకు 2 గంటలు పట్టేదని, ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతోందని ఓ ఇంటర్వ్యూలో హర్షం వ్యక్తం చేశారు. ఇది సాధ్యమని ఏనాడైనా అనుకున్నామా అని ప్రశ్నించారు. భారత్‌ అభివృద్ధిని ఇక ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేసిన రష్మిక, ప్రజలు ప్రగతికే ఓటేయాలంటూ పిలుపునిచ్చారు.

Similar News

News March 4, 2026

యుద్ధంతో వీటి ధరలు పెరుగుతాయ్!

image

ఇరాన్ వార్‌తో మనదేశంలో కంది, పెసరపప్పు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా, మయన్మార్, కెనడా నుంచి భారత్ ఏటా 5-6 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్, అఫ్గాన్ నుంచి వచ్చే జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, కుంకుమపువ్వు, ఆప్రికాట్‌ సరఫరాపై ప్రభావం పడటంతో వాటి ధరలకూ రెక్కలొచ్చే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధి నుంచి ఫెర్టిలైజర్ సప్లై కూడా నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా పెరగనున్నాయి.

News March 4, 2026

Stock Market: ₹9.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇంకా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ 1367 pts నష్టపోయి 78,871 వద్ద, నిఫ్టీ 451 pts క్షీణించి 24,414 వద్ద కొనసాగుతోంది. యుద్ధ ప్రభావం మార్కెట్ సూచీలను కిందకు లాగుతోంది. ఈ ఒక్కరోజే ట్రేడింగ్ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు ₹9.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇన్ఫీ, ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో.. టాటా స్టీల్, LT, అల్ట్రాటెక్, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

News March 4, 2026

మంచి మనుసు చాటుకున్న అల్లు అర్జున్!

image

టాలీవుడ్ సీనియర్ నటి పావలా <<18529362>>శ్యామల<<>>, ఆమె కుమార్తె ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఓ ఫౌండేషన్‌లో ఉంటున్నారు. వీరి ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మానవత్వంతో స్పందించారు. వారి వైద్య & నిత్యావసర ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.10 వేలు అందేలా ఏర్పాటు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇబ్బందుల్లో ఉన్న నటికి బన్ని చేసిన సాయంపై ప్రశంసలొస్తున్నాయి.