News July 19, 2024
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

TG: రూ.లక్ష వరకు లోన్ ఉన్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ అవుతున్నాయి. నిన్న ప్రభుత్వం ఇందుకోసం రూ.6,098 కోట్లను విడుదల చేసింది. లోన్ అకౌంట్లలో డబ్బులు జమ అయినట్లు రైతుల ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి. మరి డబ్బులు డిపాజిట్ అయినట్లు మీకు మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.
Similar News
News November 13, 2025
హోంమంత్రి సీరియస్.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్

హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై కలెక్టర్ విజయకృష్ణన్ చర్యలు తీసుకున్నారు. 2 రోజుల క్రితం హోంమంత్రి ఎస్.రాయవరం మండలం పెట్టుగోళ్లపల్లిలో కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు <<18272386>>ట్యాంకు లీకేజీ<<>>ని గమనించారు. అధికారులు పొంతన లేని సమాధానం చెప్పడంతో ప్రారంభించకుండానే వెనుదిరిగారు. ఆమె ఆదేశాలతో డీఈ, ఏఈలను సస్పెండ్ చేశారు.
News November 13, 2025
2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM

AP: రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్లో అనుమతి ఇచ్చామని, దీని ద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని CM CBN చెప్పారు. ఇవాళ రూ.2.66 లక్షల కోట్ల పెట్టుబడులకు MoUలు జరిగాయని విశాఖ ఎకనమిక్ రీజియన్ సదస్సులో వెల్లడించారు. సంపద సృష్టి కోసం అందరం జట్టుగా పని చేశామని, 20 లక్షల ఉద్యోగాల హామీని నిరూపించామని పేర్కొన్నారు. 2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమన్నారు.
News November 13, 2025
ఆ ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తాం: అమిత్ షా

ఢిల్లీ పేలుడు నిందితులకు విధించే శిక్ష ప్రపంచానికి బలమైన సందేశం పంపుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మరోసారి అలాంటి అటాక్ చేయాలనే ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తామన్నారు. ‘నిందితులపై తీసుకునే చర్యలతో భారత్ ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని సహించదని నిరూపిస్తాం. మెసేజ్ క్లియర్.. మనకు హాని కలిగించాలని ప్రయత్నించే వారు ఎవరైనా కఠిన పరిణామాలను ఎదుర్కొంటారు’ అని ఆయన హెచ్చరించారు.


