News February 4, 2025
DC ఓనర్ మన తెలుగు వారేనని తెలుసా?

IPLలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓనర్ కిరణ్ కుమార్ గ్రంధి తండ్రి ఏపీలోని రాజాంకు చెందిన GMR అధినేత గ్రంధి మల్లికార్జునరావు. ప్రస్తుతం కిరణ్ GMR ఎయిర్పోర్ట్స్కు కార్పొరేట్ ఛైర్మన్గా ఉన్నారు. ఢిల్లీ, HYD, గోవా ఎయిర్పోర్ట్స్ నిర్మాణ బాధ్యతలు పొందడంలో ఈయనదే కీలక పాత్ర. ఆయన సంపద $3 బిలియన్లకు పైనే. ఎవరూ ఊహించని విధంగా 2025 IPL వేలానికి ముందు పంత్ను వదులుకుని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.
Similar News
News April 12, 2026
IPL: ఢిల్లీ చెత్త రికార్డు

CSKతో మ్యాచ్లో <<19628621>>ఓడిన<<>> ఢిల్లీ క్యాపిటల్స్ IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అత్యధిక సార్లు(31) ఆలౌట్ అయిన జట్టుగా తన స్థానాన్ని మరింతగా ‘మెరుగు’పరుచుకుంది. ఈ లిస్టులో PBKS(27), RCB(26) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు చెపాక్ స్టేడియంలో ఢిల్లీతో ఆడిన 9 మ్యాచుల్లో 8 సార్లు CSK గెలిచింది. ఇదే స్టేడియంలో వరుసగా 6 ఓటముల తర్వాత చెన్నైని విజయం వరించింది.
News April 12, 2026
NTR ‘డ్రాగన్’లో విలన్గా బాలీవుడ్ హీరో?

NTR, నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ మూవీపై ఓ క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. విలన్గా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తొలుత మలయాళ నటుడు టొవినో థామస్ను తీసుకోవాలని భావించారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో తాను <<19526769>>నటించడం లేదని<<>> టొవినో క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో షాహిద్ను తీసుకునేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News April 12, 2026
ఇరాన్పై పోరాటం కొనసాగిస్తాం: నెతన్యాహు

ఇరాన్ టెర్రర్ పాలన, దాని మిత్రపక్షాలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టంచేశారు. తమ సరిహద్దుల వెంబడి ఉగ్ర సంస్థల ఉనికిని సహించబోమని హెచ్చరించారు. శత్రు భూభాగంలో సెక్యూరిటీ జోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ ఇరాన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కుర్దిష్ పౌరులపై సామూహిక హత్యాకాండకు ఆయనే బాధ్యుడని ఆరోపించారు.


