News September 19, 2024
కాసేపట్లో పవన్తో బాలినేని, ఉదయభాను భేటీ?

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మరికాసేపట్లో వైసీపీ మాజీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను కలవనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ తమ అనుచరులతో విజయవాడకు చేరుకున్నారు. పవన్తో భేటీ అనంతరం జనసేనలో చేరేదానిపై వీరు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. వీరి బాటలోనే మరికొందరు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 8, 2025
BOBలో 82 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లోని రిసీవబుల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో 82 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBD, మహిళలకు రూ.175. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bankofbaroda.bank.in
News December 8, 2025
అధిక దిగుబడినిచ్చే నువ్వుల రకాలు ఇవే..

☛ ఎలమంచిలి 66 (శారద): ఈ రకం పంట కాలం 80-90 రోజులు. దిగుబడి ఎకరాకు 500-600 కిలోలు. లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. బూడిద, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది.
☛ Y.L.M 146: పంట కాలం 90-95 రోజులు. దిగుబడి ఎకరాకు 600 కిలోలు. నూనె 45%గా ఉంటుంది. వేరు, కాండం కుళ్లు, వెర్రి తెగులు, ఆల్టర్నేరియా, సర్కోస్పర ఆకుమచ్చ తెగుళ్లను కొంత వరకు తట్టుకుంటుంది.
News December 8, 2025
900 మంది పైలట్లను తీసుకోనున్న ఇండిగో!

సంక్షోభం నుంచి బయటపడేందుకు భారీగా పైలట్లను నియమించుకోవడంపై ఇండిగో దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 10కి 158 మంది, 2026 Dec కల్లా 742 మందిని తీసుకుంటామని ప్రభుత్వానికి సంస్థ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ‘ప్రస్తుతం 250 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తోంది. మరో 300 మంది కెప్టెన్లు, 600 మంది ఫస్ట్ ఆఫీసర్ల నియామకం/అప్గ్రేడ్ చేయనుంది’ అని తెలిపింది. కాగా ఇండిగోకు 5,456 మంది పైలట్లు ఉన్నారు.


