News February 11, 2025

సభలో మాట్లాడటానికే కదా గెలిపించింది: జీవీ

image

AP: అసెంబ్లీ అంటే భయంతోనే మాజీ CM జగన్ రావట్లేదని ప్రభుత్వ చీఫ్ విప్ GV ఆంజనేయులు ఆరోపించారు. ‘జగన్ అసెంబ్లీకి రాననడం సమంజసమేనా? ఆయనకు కనీసం ఇంగితజ్ఞానం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది సభ కాదు.. ప్రజలు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చిస్తే సమాధానమిస్తాం. ప్రజా సమస్యలపై ఆసక్తి లేదు కాబట్టే రావట్లేదు. గతంలో ఏ నాయకుడూ ఇలా చేయలేదు. సభలో మాట్లాడటానికే కదా ప్రజలు గెలిపించింది’ అని నిలదీశారు.

Similar News

News December 5, 2025

అందుకే IPLకు గుడ్‌బై చెప్పా: ఆండ్రీ రస్సెల్‌

image

వెస్టిండీస్‌ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్‌ IPLకు <<18429844>>గుడ్‌బై<<>> చెప్పిన కారణాన్ని తాజాగా వెల్లడించారు. “ఐపీఎల్‌ ప్రపంచంలోనే అతి పెద్ద టోర్నీ. ప్రయాణాలు, వరుస మ్యాచ్‌లు, ప్రాక్టీస్‌, జిమ్‌ వర్క్‌లోడ్‌ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం సవాలుతో కూడుకున్నది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ నేను ప్రభావం చూపాలి. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగాలని అనుకోవడం లేదు” అని తెలిపారు.

News December 5, 2025

ఇండిగో ఎఫెక్ట్.. డీజీసీఏ కీలక నిర్ణయం

image

ఇండిగో సంక్షోభం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధుల విషయంలో విధించిన <<18475795>>ఆంక్షలను <<>>ఎత్తివేసింది. సిబ్బంది వారాంతపు విశ్రాంతి సెలవుల నిబంధనను తొలగించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. పలు విమానయాన సంస్థల వినతి మేరకు చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయంతో ఫ్లైట్ల సర్వీసులు తిరిగి యథావిధిగా ప్రారంభం కానున్నాయి.

News December 5, 2025

‘హిల్ట్’పై హైకోర్టులో విచారణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

image

TG: <<18450502>>హిల్ట్<<>> పాలసీపై పర్యావరణవేత్త పురుషోత్తం, ప్రజాశాంతి పార్టీ చీఫ్ KA పాల్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దీనిపై సీబీఐ లేదా ఈడీతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.