News February 11, 2025

సభలో మాట్లాడటానికే కదా గెలిపించింది: జీవీ

image

AP: అసెంబ్లీ అంటే భయంతోనే మాజీ CM జగన్ రావట్లేదని ప్రభుత్వ చీఫ్ విప్ GV ఆంజనేయులు ఆరోపించారు. ‘జగన్ అసెంబ్లీకి రాననడం సమంజసమేనా? ఆయనకు కనీసం ఇంగితజ్ఞానం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది సభ కాదు.. ప్రజలు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చిస్తే సమాధానమిస్తాం. ప్రజా సమస్యలపై ఆసక్తి లేదు కాబట్టే రావట్లేదు. గతంలో ఏ నాయకుడూ ఇలా చేయలేదు. సభలో మాట్లాడటానికే కదా ప్రజలు గెలిపించింది’ అని నిలదీశారు.

Similar News

News October 14, 2025

బత్తాయి, నిమ్మ: OCTలో చేపట్టాల్సిన చర్యలివే..

image

అక్టోబర్‌లో బత్తాయి, నిమ్మ తోటల్లో కాయలు ఉన్న చెట్లకు తేలికపాటి తడి ఇవ్వాలి. శిలీంధ్ర వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు కాండంపై బోర్డో పేస్టును పూసుకోవాలి. పిందె, కాయలు రాలడాన్ని నివారించడానికి 100గ్రా. కార్బండిజమ్, 1KG యూరియాను 100L నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. నల్లి నివారణకు నీటిలో కరిగే గంధకాన్ని లీటరు నీటికి 3గ్రా. చొప్పున కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.

News October 14, 2025

సత్యం వైపు మార్గం చూపేదే ‘వేదం’

image

భగవంతుడు సత్య స్వరూపుడు. శాశ్వతుడు. కానీ ఈ జగత్తు అశాశ్వతం. సత్యమైన దేవుడే ఈ మిథ్యా లోకాన్ని సృష్టించాడు. ఈ అశాశ్వతమైన జీవులందరికీ ముక్తి ప్రసాదించి, తనలో శాశ్వతంగా ఐక్యం చేసుకోవడమే భగవంతుడి అంతిమ లక్ష్యం. జీవులు తిరిగి సత్యం వైపు పయనించడానికి, శాశ్వత స్థితిని పొందడానికి అవసరమైన దేవ మార్గాన్ని(మోక్ష మార్గాన్ని) స్పష్టంగా తెలియజేసేదే వేదం. అందుకే వేదమే సృష్టి ప్రయోజనాన్ని వివరిస్తుంది. <<-se>>#VedikVibes<<>>

News October 14, 2025

రాష్ట్రంలో IT అభివృద్ధికి సలహా మండలి

image

AP: ప్రభుత్వం, స్టార్టప్స్, పారిశ్రామికవేత్తలను సమన్వయం చేసేందుకు IT సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి లోకేశ్ సహా ఇన్ఫోసిస్, IBM, TCS వంటి సంస్థల హెడ్‌లు, CII ప్రతినిధులు, ఎక్స్‌పర్ట్స్, విద్యారంగ, పరిశోధన సంస్థల ప్రతినిధులు వంటి వారికి చోటు కల్పించారు. అవసరం అనుకుంటే సబ్ కమిటీలు/టాస్క్ ఫోర్సులను సైతం ఏర్పాటు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.