News April 1, 2025
ఒత్తిడి వల్ల లంచ్ చేయలేదు: అశ్వనీ కుమార్

IPLలో ఆడిన తొలి మ్యాచ్లోనే 4 వికెట్లతో సత్తా చాటిన MI బౌలర్ అశ్వనీ కుమార్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తొలి మ్యాచ్ కావడం వల్ల ఒత్తిడితో లంచ్ చేయలేదని, కేవలం అరటి పండు తిన్నట్లు చెప్పారు. మంచి ప్రదర్శన ఇవ్వడానికి తాను కొంత ప్లాన్ చేసుకోగా, జట్టు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందన్నారు. షార్ట్ లెంగ్త్తో పాటు బ్యాటర్ల బాడీని టార్గెట్ చేస్తూ బంతులు వేయాలని కెప్టెన్ హార్దిక్ సూచించారని అశ్వనీ తెలిపారు.
Similar News
News January 18, 2026
గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ హార్మోన్లు కలిసి ఉన్న మాత్రలు వినియోగించే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్త ప్రవాహం జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టడం వల్ల క్రిప్టోజెనిక్ స్ట్రోక్ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్లలో దాదాపు 40% క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రోక్లేనని తెలిపారు.
News January 18, 2026
ఇతిహాసాలు క్విజ్ – 127 సమాధానం

ఈరోజు ప్రశ్న: మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు ఉండి కూడా, పాండవుల విజయాన్ని కోరుకున్నది ఎవరు?
సమాధానం: కురుక్షేత్రంలో కౌరవుల సైన్యాధిపతిగా ఉన్న భీష్ముడు పాండవుల విజయాన్ని కోరుకున్నారు. ధర్మం పాండవుల వైపే ఉందని ఆయనకు తెలుసు. అందుకే, తనను ఎలా ఓడించాలో స్వయంగా పాండవులకే రహస్యాన్ని చెప్పి, వారు విజయం సాధించేలా సహకరించారు. ఆయనతో పాటు విదురుడు కూడా పాండవ పక్షపాతిగా ఉండేవారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 18, 2026
రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది: హరీశ్రావు

TG: రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉందని మాజీమంత్రి హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి, ప్రజాద్రోహం కలిస్తే రేవంత్ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ CMగా ఉంటూ కేంద్రంలోని BJPతో చీకటి స్నేహం చేస్తున్నారు. ఆ పార్టీ శత్రువులైన BJP, TDP కూటమికి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజకీయ యాత్ర CBN కనుసన్నల్లో సాగుతోంది. హింసను ప్రేరేపించేలా CM చేసిన కామెంట్లపై డీజీపీ ఏ చర్యలు తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.


