News June 6, 2024

నాలుగైదు రోజులపాటు ఆ షాక్ నుంచి తేరుకోలేదు: రోహిత్

image

వన్డే WC ఫైనల్లో ఓటమి తర్వాత నాలుగైదు రోజుల పాటు షాక్ నుంచి తేరుకోలేకపోయానని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఫైనల్ జరిగిన తర్వాత రోజు నిద్ర లేచా. ఆ రాత్రి మనం ఓడిపోయినట్లు కల వచ్చింది. మరుసటి రోజు ఫైనల్ అనుకొని నిజంగా ఇలాగే జరుగుతుందా అని నా భార్య రితికాను అడిగా. కాసేపటికే తేరుకొని మనం ఓడిపోయామని గ్రహించా’ అని వెల్లడించారు.

Similar News

News October 15, 2025

ఓ టెకీ.. నీ శరీరం కోరుకుంటోందిదే!

image

స్తంభించిన జీవనశైలితో ఎంతో మంది టెకీలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ‘నేచర్ సైన్స్ రిపోర్ట్స్’ అధ్యయనంలో తేలింది. ‘సమయానికి ఆహారం ఇవ్వవు. ఇచ్చినా ప్రాసెస్ చేయలేని జంక్ ఇస్తావ్. నిద్రలేక నేను కూడా అలసిపోయాను. నా మాటే వినకపోతే, నీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది’ అని టెకీ శరీరం హెచ్చరిస్తోంది. అందుకే ఇకనైనా రోజూ వ్యాయామం, నడకతో పాటు సరైన నిద్రాహారాలు ఉండేలా చూసుకోండి. SHARE IT

News October 15, 2025

ఓట్ల చోరీతో గెలిచింది బీఆర్ఎస్సే: శ్రీధర్

image

TG: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. అసలు ఓటు చోరీతో గెలిచిందే BRS పార్టీయని <<18006137>>కేటీఆర్<<>> వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. గతంలో MLC ఎన్నికల్లో ఓట్ల చోరీ చేసి గెలిచిందని ఆయన విమర్శించారు. అర్హత లేని విద్యార్థులను ఓటర్లుగా చేర్చారని ఆరోపించారు. మరోవైపు మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సమస్య ఉంటే పరిష్కారం చూపేందుకు పీసీసీ చీఫ్, CM ఉన్నారని తెలిపారు.

News October 15, 2025

13 జిల్లాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు(1/2)

image

AP: ఖరీఫ్‌ సీజన్‌ పత్తి సేకరణకు ప్రభుత్వం 13 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తారు. ☛ విజయనగరం జిల్లాలోని రాజాం
☛ మన్యం జిల్లాలో సాలూరు, పాలకొండ(భామిని)
☛ కాకినాడ జిల్లాలో పిఠాపురం ☛ ఏలూరు జిల్లాలో చింతలపూడి (జంగారెడ్డిగూడెం)
☛ NTR జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు (గంపలగూడెం, ఏ కొండూరు), కంచికచర్ల