News August 30, 2024
BJP – LJP మధ్య విభేదాలు.. స్పందించిన చిరాగ్ పాస్వాన్

BJP- LJP(RV) మధ్య విభేదాలు తలెత్తినట్లు వస్తున్న కథనాలను కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీపై తనకున్న ప్రేమ చెక్కుచెదరనిదని, ఆయనతో ఉన్న అనుబంధం దృఢమైనదని చిరాగ్ పేర్కొన్నారు. తన అభిప్రాయాలు ఎల్లప్పుడూ ప్రభుత్వ వైఖరికి అద్దంపడతాయన్నారు. లేటరల్ ఎంట్రీలు, వక్ఫ్ బిల్లుపై LJP అభ్యంతరాలు లేవనెత్తడంతో 2 పార్టీల మధ్య విభేదాలు రాజుకున్నట్టు వార్తలు వచ్చాయి.
Similar News
News November 7, 2025
దక్షిణ మధ్య రైల్వేలో 61 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 7, 2025
తరచూ ఛాతి ఎక్స్రేలు తీయించుకుంటున్నారా?

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
News November 7, 2025
వేమూరి వినోద్ అరెస్ట్.. రిమాండ్కు తరలింపు

AP: కర్నూలు బస్సు <<18110276>>ప్రమాద ఘటన<<>>లో వి.కావేరి ట్రావెల్స్ యజమాని, A2 వేమూరి వినోద్ కుమార్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ వెల్లడించారు. కర్నూలు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. OCT 28న A1 డ్రైవర్ లక్ష్మణ్ను అరెస్టు చేశారు. గత నెల జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.


