News August 30, 2024

BJP – LJP మధ్య విభేదాలు.. స్పందించిన చిరాగ్ పాస్వాన్

image

BJP- LJP(RV) మ‌ధ్య విభేదాలు తలెత్తినట్లు వస్తున్న క‌థ‌నాల‌ను కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తోసిపుచ్చారు. ప్ర‌ధాని మోదీపై త‌న‌కున్న ప్రేమ చెక్కుచెద‌ర‌నిద‌ని, ఆయ‌న‌తో ఉన్న అనుబంధం దృఢ‌మైన‌ద‌ని చిరాగ్ పేర్కొన్నారు. తన అభిప్రాయాలు ఎల్లప్పుడూ ప్రభుత్వ వైఖరికి అద్దంపడతాయన్నారు. లేట‌ర‌ల్ ఎంట్రీలు, వ‌క్ఫ్ బిల్లుపై LJP అభ్యంత‌రాలు లేవ‌నెత్త‌డంతో 2 పార్టీల మ‌ధ్య విభేదాలు రాజుకున్న‌ట్టు వార్తలు వ‌చ్చాయి.

Similar News

News December 19, 2025

నేటి ముఖ్యాంశాలు

image

❁ AP: చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
❁ ‘PPP’ తప్పనుకుంటే నన్ను జైలుకు పంపు జగన్: సత్యకుమార్
❁ వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవాలి: జగన్
❁ గతేడాదితో పోలిస్తే ఏపీలో నేరాలు తగ్గుముఖం: DGP
❁ TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో 66% సీట్లు మావే: రేవంత్
❁ గ్రూప్-3 ఫలితాలు విడుదల.. 1,370 మంది అభ్యర్థులు ఎంపిక
❁ KCR అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు: KTR
❁ SMAT విజేతగా ఝార్ఖండ్

News December 19, 2025

మెస్సీ ఈవెంట్.. రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసిన గంగూలీ

image

నిర్వహణ లోపం వల్ల కోల్‌కతాలో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ఈవెంట్ రద్దైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఈవెంట్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారన్న AFCK ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహా ఆరోపణలపై సౌరభ్ గంగూలీ పరువు నష్టం దావా వేశారు. నిరాధారమైన సాహా వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని రూ.50 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తనకు ఈవెంట్‌తో ఎలాంటి సంబంధం లేదని, కేవలం గెస్ట్‌గా హాజరయ్యానని ఆయన స్పష్టం చేశారు.

News December 19, 2025

మూడు నెలల్లో ఒకే గ్రామంలో 27వేల జననాలు.. తీరా చూస్తే!

image

MH యావత్మల్(D) శేందుర్సనీ GPలో గత మూడు నెలల వ్యవధిలో ఏకంగా 27,397 జననాలు నమోదవ్వడం కలకలం రేపింది. 1,500 మంది ఉండే ఈ గ్రామంలో ఈ సంఖ్యలో జననాలు ఉండటం సైబర్ కుట్రగా అధికారులు భావిస్తున్నారు. వీటిలో 99శాతం ఎంట్రీలు వెస్ట్ బెంగాల్, UP నుంచే ఉన్నాయని BJP నేత కిరీట్ సోమయ్య అన్నారు. ఈ విషయంపై CMతో మాట్లాడి బర్త్ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. కాగా దీనిపై కేసు నమోదైంది.