News August 30, 2024

BJP – LJP మధ్య విభేదాలు.. స్పందించిన చిరాగ్ పాస్వాన్

image

BJP- LJP(RV) మ‌ధ్య విభేదాలు తలెత్తినట్లు వస్తున్న క‌థ‌నాల‌ను కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తోసిపుచ్చారు. ప్ర‌ధాని మోదీపై త‌న‌కున్న ప్రేమ చెక్కుచెద‌ర‌నిద‌ని, ఆయ‌న‌తో ఉన్న అనుబంధం దృఢ‌మైన‌ద‌ని చిరాగ్ పేర్కొన్నారు. తన అభిప్రాయాలు ఎల్లప్పుడూ ప్రభుత్వ వైఖరికి అద్దంపడతాయన్నారు. లేట‌ర‌ల్ ఎంట్రీలు, వ‌క్ఫ్ బిల్లుపై LJP అభ్యంత‌రాలు లేవ‌నెత్త‌డంతో 2 పార్టీల మ‌ధ్య విభేదాలు రాజుకున్న‌ట్టు వార్తలు వ‌చ్చాయి.

Similar News

News December 18, 2025

భారత్‌కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం

image

ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన ఫైనల్ పోటీల్లో కర్ణాటకకు చెందిన విద్యా సంపత్‌ మిసెస్‌ ఎర్త్‌ ఇంటర్నేషనల్‌-2025గా నిలిచారు. మంగళూరుకు చెందిన విద్య ముంబయిలో పుట్టి పెరిగారు. ఈ పోటీల్లో జాతీయ పక్షి నెమలి, జాతీయ ప్రాణి పులి, జాతీయ పుష్పాన్ని పోలిన వస్త్రాలను ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. 22 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీపడి భారత్‌కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం అందిచారు విద్య.

News December 18, 2025

కాసులు కురిపిస్తున్న మల్లెల సాగు

image

AP: మల్లె పూల సాగు రైతులకు, రాష్ట్రానికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. మల్లె సాగు ద్వారానే వ్యవసాయ రంగంలో రూ.10,749 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపులో ఇది 6.06 శాతంగా ఉంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మల్లె సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మిగిలిన జిల్లాల రైతులు కూడా మల్లెసాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

News December 18, 2025

నితీశ్ కుమార్‌కు పాక్ గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు!

image

బిహార్ CM నితీశ్ కుమార్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. మహిళా డాక్టర్ హిజాబ్‌ <<18574954>>లాగిన<<>> ఘటనపై నితీశ్ క్షమాపణలు చెప్పాలని పాక్ గ్యాంగ్‌స్టర్ షహ్జాద్ భట్టి డిమాండ్ చేశాడు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సోషల్ మీడియాలో హెచ్చరించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డాడు. ఈ బెదిరింపు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతానికి వివరాలేమీ లేవని DGP వినయ్ కుమార్ తెలిపారు.