News June 16, 2024
లోక్సభ స్పీకర్ అభ్యర్థి ఎంపికపై NDAలో భిన్న స్వరాలు?

లోక్సభ స్పీకర్ పదవి NDAలో భాగమైన ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో JDU, TDP నేతల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. స్పీకర్ అభ్యర్థిగా BJP ఎవరిని నామినేట్ చేస్తే వారికే మద్దతు ఇస్తామని JDU నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించగా, మిత్రపక్షాలన్నీ సమావేశమై అభ్యర్థిని నిర్ణయిస్తాయని TDP నేత పట్టాభిరామ్ తెలిపారు. మరోవైపు JDU/TDPకి ఈ పదవిని ఇవ్వాలని ఇండియా కూటమి నేతలు అంటున్నారు.
Similar News
News November 18, 2025
‘ఇంటికి రా బిడ్డా’ అని కోరిన తల్లి.. వారానికే హిడ్మా హతం

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లిని ఇటీవల ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇప్పటికైనా ఇంటికి రా’ అని ఆమె కోరారు. ఇది జరిగిన వారం రోజులకే హిడ్మా హతమయ్యాడు. తాజా ఎన్కౌంటర్లో అతని భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెపై రూ.50లక్షల రివార్డు ఉంది.
News November 18, 2025
‘ఇంటికి రా బిడ్డా’ అని కోరిన తల్లి.. వారానికే హిడ్మా హతం

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లిని ఇటీవల ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇప్పటికైనా ఇంటికి రా’ అని ఆమె కోరారు. ఇది జరిగిన వారం రోజులకే హిడ్మా హతమయ్యాడు. తాజా ఎన్కౌంటర్లో అతని భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెపై రూ.50లక్షల రివార్డు ఉంది.
News November 18, 2025
వందల మంది మృతికి హిడ్మానే కారణం!

దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిన హిడ్మా.. కేంద్ర బలగాలపై మెరుపుదాడుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. PLGA 1వ బెటాలియన్కు నాయకత్వం వహిస్తూ, కేంద్ర కమిటీలో చిన్న వయస్కుడిగా ఎదిగాడు. పలు దాడుల్లో కీలకపాత్ర పోషించాడు.
*2010 దంతెవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి
*2013 జిరామ్ ఘాట్లో కాంగ్రెస్ నేతలతో సహా 27 మంది మృతి
*2021 సుక్మా-బీజాపూర్లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి


