News November 5, 2024

కన్వీనియెన్స్‌తో కష్టం గురూ!

image

అతి సర్వత్ర వర్జయేత్! టెక్నాలజీతో మానవ జీవితం మారిపోయింది. శ్రమ తగ్గింది. కన్వీనియెన్స్ పెరిగింది. మరీ ఎక్కువ కన్వీనియెన్స్ మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది మన బేసిక్ ఇన్‌స్టింక్ట్స్‌ను మార్చేస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. EX. పిక్నిక్ వెళ్లినప్పుడు పులి ఎదురైతే అక్కడ్నుంచి పారిపోవడం మానవ నైజం. లేదు అదే వెళ్లిపోతుందిలే అని సెల్ఫీ దిగడం లేజీనెస్. కన్వీనియెన్స్‌తో వచ్చే ప్రమాదాలు ఇలాంటివే.

Similar News

News December 16, 2025

నువ్వుల పంటలో కలుపు నివారణ, అంతరకృషి

image

నువ్వుల పంట విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 30%ఇ.సి. 700mlను కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉంటే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. అలాగే దీని పిచికారీ తర్వాత నీటి తడి పెట్టకూడదు. విత్తిన 15-20 రోజుల లోపు అదనపు మొక్కలను, 25-30 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి.

News December 16, 2025

భారత్‌లోనూ 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలా?

image

భారత్‌లో 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 60% పిల్లలు ప్రతిరోజూ దాదాపు 3 గంటలు వివిధ SM ప్లాట్‌ఫామ్‌లు, గేమింగ్ సైట్లలో గడుపుతున్నట్టు స్టడీలు వెల్లడిస్తున్నాయి. అది వ్యసనంగా మారి మానసిక ఆరోగ్య సమస్యలు, సైబర్ దాడుల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. <<18520645>>ఆస్ట్రేలియా<<>>లో చేసినట్టే భారత్‌లోనూ నిషేధించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News December 16, 2025

‘కొండగట్టు అంజన్న’కు అటవీ శాఖ నోటీసులు

image

TG: ‘కొండగట్టు ఆంజనేయ స్వామి’ గుడికి అటవీశాఖ నోటీసులివ్వడం వివాదంగా మారింది. ఇక్కడి 6 ఎకరాలు తమవని, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చే అధికారం తమకుందని అందులో పేర్కొంది. కాగా వేద పాఠశాల, వసతి, భోజనశాల అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి. వాహన పూజలు, గిరి ప్రదక్షిణ దీనిలో సాగుతుంటాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని BJP చీఫ్ రాంచందర్ రావు పేర్కొన్నారు.