News July 17, 2024
చిక్కుల్లో ట్రైనీ IAS తండ్రి దిలీప్

మహారాష్ట్రకు చెందిన ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీకి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె తండ్రి దిలీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దిలీప్ ఖేడ్కర్ <<13605832>>ఆస్తులపై<<>> విచారణకు పుణేలోని ACB సిద్ధమైంది. మరోవైపు పూజ పేరెంట్స్ ఓ రైతును పిస్తల్తో బెదిరించిన ఘటనలో ఇప్పటికే ఇంకో కేసు నమోదైంది.
Similar News
News November 22, 2025
జనగామ: మూడు విడతల్లో పంచాయతీ సమరం..!

జిల్లాలో పంచాయతీ ఎన్నికల సరళి ప్రారంభమైంది. డ్రాఫ్ట్ రూపంలో రిజర్వేషన్లు సిద్ధం చేస్తున్నారు. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి విడతలో జనగామ, లింగాలఘనపురం, నర్మెట్ట, తరిగొప్పుల, రెండో విడతలో బచ్చన్నపేట, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, మూడో విడతల్లో చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, జఫర్గఢ్ మండలాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News November 22, 2025
‘నక్క’ బుద్ధి చూపించింది!.. భారతీయుల ఆగ్రహం

ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్ ఛానల్పై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో మ్యాచ్ అయితే ఒకలా, ఆస్ట్రేలియాలో అయితే మరోలా మాట్లాడుతోందని అంటున్నారు. యాషెస్ టెస్టులో తొలి రోజు 19 వికెట్లు పడ్డాయంటూ గొప్పగా రాసుకొచ్చింది. అయితే ఇటీవల INDvsSA టెస్టు మ్యాచ్లో ఒకేరోజు 15 వికెట్లు పడటంపై “RIP TEST CRICKET” అంటూ పేర్కొంది. దీంతో ‘నక్క’ బుద్ధి చూపిస్తోందని ట్రోల్ చేస్తున్నారు.
News November 22, 2025
AP న్యూస్ అప్డేట్స్

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.


