News January 30, 2025
1998లో అదృశ్యం.. కుంభమేళాలో అఘోరాగా ప్రత్యక్షం

27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తను ఓ భార్య కుంభమేళాలో గుర్తించారు. ఝార్ఖండ్కు చెందిన గంగాసాగర్ 1998లో భార్య ధన్వా దేవి, పిల్లలను వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం వారు వెతుకుతూనే ఉన్నారు. కుంభమేళాకు వెళ్లిన కుటుంబసభ్యులకు ఆయన అఘోరాగా కనిపించారు. అతడి నుదుటిపై మచ్చ, ఎత్తు పళ్లు, మోకాలిపై దెబ్బలు గుర్తించి తన భర్తేనని ధన్వా దేవి గుర్తించారు. కానీ వారితో వచ్చేందుకు ఆయన నిరాకరించారు.
Similar News
News November 25, 2025
300 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(OICL) 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 10న టైర్ 1ఎగ్జామ్, ఫిబ్రవరి 25న టైర్ 2 ఎగ్జామ్ నిర్వహించనున్నారు. విద్యార్హతలు, వయసు తదితర వివరాలు పూర్తి స్థాయి నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు. వెబ్సైట్: https://orientalinsurance.org.in
News November 25, 2025
రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు

AP: రాష్ట్రంలో మరో మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం (రంపచోడవరం కేంద్రం) జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్లకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
News November 25, 2025
STRANGE: ఈ ఆలయం గురించి తెలుసా?

అభిమాన హీరోలకు గుడులు కట్టడం చూస్తుంటాం. అయితే బైక్కు గుడి కట్టి పూజించే ఆలయం ఒకటుంది. బుల్లెట్ బాబా ఆలయం రాజస్థాన్లోని జోధ్పూర్-పాలీ హైవేపై ఉంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్(RNJ 7773) బైక్ను దేవుడిగా పూజిస్తారు. 1988లో యాక్సిడెంట్లో ఓం సింగ్ చనిపోగా.. బైక్ను వేరే చోటుకు తీసుకెళ్లినా మళ్లీ అక్కడికే వచ్చింది. సురక్షిత ప్రయాణం కోసం ఈ బైక్ను పూజిస్తారు. దీనిపై ‘DUG DUG’ అనే మూవీ వచ్చింది.


