News May 20, 2024

ముగ్గురు ఐపీఎస్‌లపై క్రమశిక్షణ చర్యలు

image

AP: ఎన్నికల హింసకు బాధ్యుల్ని చేస్తూ EC సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు SPలు అమిత్, బిందు మాధవ్, బదిలీ వేటు గురైన తిరుపతి SP కృష్ణకాంత్‌పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసింది. 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదనలు వినిపించాలని ఆదేశించింది. లేదంటే తమవద్ద ఉన్న ఆధారాలను బట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు CS జవహర్ ఉత్తర్వులిచ్చారు.

Similar News

News November 2, 2025

T20Iలకు కేన్ మామ గుడ్ బై

image

NZ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విలియమ్సన్ T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించారు. 2011లో T20ల్లో డెబ్యూ చేసిన ఆయన 93 మ్యాచుల్లో 2,575 రన్స్ చేశారు. ఇందులో 18 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 95. కివీస్ తరఫున 75 మ్యాచులకు కెప్టెన్సీ చేశారు. షార్టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు తనతో పాటు జట్టుకూ ఇదే సరైన సమయమని కేన్ తెలిపారు. దీంతో రానున్న T20WC ప్రిపరేషన్‌కు జట్టుకు క్లారిటీ వస్తుందన్నారు.

News November 2, 2025

లండన్ పర్యటనలో CM చంద్రబాబు దంపతులు

image

AP: CM చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఈనెల 5 వరకు ఈ వ్యక్తిగత పర్యటన కొనసాగనుంది. ఈనెల 4న భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డును అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ స్వీకరించనున్నారు. అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను CII సదస్సుకు ఆహ్వానిస్తారు.

News November 2, 2025

తిరుమలలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థానం

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి వాహన సేవను నిర్వహించనున్నారు. మలయప్పస్వామి శ్రీదేవీ, భూదేవీ సమేతంగా మాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ వాహన సేవ ఉ.6-7.30 గంటల మధ్య జరగనుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.