News November 12, 2024
అభ్యర్థుల మార్కుల వెల్లడి గోప్యత ఉల్లంఘన కాదు: కోర్టు

రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల్ని వెల్లడించడం గోప్యత ఉల్లంఘన కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. పుణే కోర్టులో ఉద్యోగానికి పరీక్షలు రాసిన ఓంకార్ అనే వ్యక్తి ఇంటర్వ్యూకు ఎంపిక కాకపోవడంతో అభ్యర్థులందరి మార్కుల వివరాల కోసం RTI దరఖాస్తు చేశారు. అది గోప్యత ఉల్లంఘన అవుతుందంటూ అతడి దరఖాస్తును RTI కమిషనర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఓంకార్ హైకోర్టును ఆశ్రయించగా బెంచ్ తాజా తీర్పునిచ్చింది.
Similar News
News December 26, 2025
గొంతులు కోస్తున్న చైనా మాంజా.. జాగ్రత్త!

సంక్రాంతి సమీపిస్తుండటంతో ఆకాశంలో పతంగులు సందడి చేస్తున్నాయి. కానీ ఆ సరదా వెనుక ప్రమాదం కూడా పొంచి ఉంది. అదే చైనా మాంజా. దీనిపై నిషేధం ఉన్నా ఇప్పటికీ యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా HYD శివారు కీసరలో చైనా మాంజా మెడకు తగిలి జశ్వంత్ అనే యువకుడికి తీవ్ర గాయమైంది. బైక్పై వెళ్తున్న అతడి మెడను మాంజా కోసేయడంతో ఏకంగా 19 కుట్లు పడ్డాయి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు మీరూ జాగ్రత్త వహించండి.
News December 26, 2025
కోహ్లీకి POTM.. ప్రైజ్ మనీ తెలిస్తే అవాక్కే!

విజయ్ హజారే ట్రోఫీలో GJతో మ్యాచులో ఢిల్లీ 7రన్స్ తేడాతో గెలిచింది. 77రన్స్ చేసిన ఆ టీమ్ ప్లేయర్ కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(POTM) అవార్డు వరించింది. దీంతో ఆయనకు రూ.10,000 చెక్ ఇవ్వడం గమనార్హం. ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ప్రైజ్ మనీ రూ.లక్షల్లో ఉండగా ‘లిస్ట్-ఎ’ల్లో ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఎంతపెద్ద ఆటగాడికైనా అంతే అమౌంట్ అని, కోహ్లీ రూ.10వేల చెక్ తీసుకోవడం ఫన్నీగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News December 26, 2025
శిల్పాశెట్టి అసభ్యకర వీడియోలు.. వెంటనే తొలగించాలన్న కోర్టు

AI ఉపయోగించి తయారుచేసిన నటి శిల్పాశెట్టి డీప్ఫేక్ వీడియోల URLs, లింక్స్, పోస్టులను వెంటనే డిలీట్ చేయాలని సంబంధిత సైట్లను బాంబే HC ఆదేశించింది. ఆన్లైన్లో ఉన్న తన అసభ్యకర ఫొటోలు, వీడియోలను తొలగించాలని శిల్ప వేసిన పిటిషన్ను జస్టిస్ అద్వైత్ ఎం సేథ్నా వెకేషన్ బెంచ్ విచారించింది. ప్రాథమిక గోప్యత హక్కును ప్రభావితం చేసేలా ఒక వ్యక్తి/వ్యక్తిత్వాన్ని చిత్రీకరించకూడదని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.


