News July 5, 2024
సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తా: CBN

TG CM రేవంత్ రెడ్డితో భేటీపై AP CM చంద్రబాబు స్పందించారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమే తన విధానమన్నారు. రెండింటికీ సమన్యాయం చేయాలని విభజన వేళ కూడా చెప్పానని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని చంద్రబాబు తెలిపారు. కాగా ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. CBNకు స్వాగతం పలికేందుకు TDP శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి.
Similar News
News December 19, 2025
సౌతాఫ్రికా దూకుడు.. 10 ఓవర్లలోనే 118

భారత్ నిర్దేశించిన 232 పరుగుల భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా దుమ్మురేపుతోంది. 10 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 118 రన్స్ చేసింది. ఓపెనర్ డికాక్ (65*), బ్రెవిస్ (29*) చెలరేగి ఆడుతున్నారు. హెండ్రిక్స్ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశారు. భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మరి ఈ మ్యాచులో భారత్ గెలుస్తుందా? కామెంట్ చేయండి.
News December 19, 2025
అమిత్ షాతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పురోగతి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను వివరించారు. అంతకుముందు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం.. అమరావతి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని, హైవే నెట్వర్క్లతో రాజధానిని కనెక్ట్ చేయాలని కోరారు.
News December 19, 2025
సొసైటీ పాలకవర్గాలు రద్దు.. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు

TG: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు 9 జిల్లాల DCCB పాలకమండళ్లను సైతం తొలగించింది. ఇప్పటికే 2 సార్లు వీటి పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు PACSలకు పర్సన్ ఇన్ఛార్జులను నియమించి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీరిని కొనసాగించాలని పేర్కొంది. త్వరలోనే సొసైటీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.


